గాలిపటంతో ‘ఇంటికి’ కరెంట్!
సరదాగా ఎగరేసుకునే పతంగితో ఇంటికి కావల్సిన కరెంటును సృష్టించొచ్చు! ఎంచక్కా కరెంటు బిల్లుల ఖర్చు తగ్గించుకోవచ్చు! ఇదేమీ పరాచికానికి చెబుతున్నది కాదు.
సరదాగా ఎగరేసుకునే పతంగితో ఇంటికి కావల్సిన కరెంటును సృష్టించొచ్చు! ఎంచక్కా కరెంటు బిల్లుల ఖర్చు తగ్గించుకోవచ్చు! ఇదేమీ పరాచికానికి చెబుతున్నది కాదు. పచ్చినిజం! పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఇదో మార్గమంటున్నారు శాస్త్రవేత్తలు!
గాలి ద్వారా కరెంటు ఉత్పత్తి (పవన విద్యుత్) ఇప్పటికే ఉన్నదే. భూమిపై 80 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే గాలిమర (విండ్ టర్బైన్స్)ల ద్వారా పవన విద్యుత్ను తయారు చేస్తున్నారు. అయితే భూమి మీదికంటే 200 మీటర్లపైన (656 అడుగులపైన) ఎత్తులో గాలులు మరింత స్థిరంగా, బలంగా వీస్తాయని... వాటి ద్వారా మరింత ఎక్కువ విద్యుత్ సృష్టించవచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. భూమ్మీద పవన విద్యుత్ కంటే పైన ఎత్తులో వీచే రెట్టింపుగాలితో ఎనిమిదింతలు ఎక్కువ విద్యుత్ను తయారు చేయవచ్చంటున్నారు.
ఈ ప్రక్రియపై పరిశోధనలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. భారీ ఖర్చుతో కూడుకొని ఉండటంతో కొన్ని కంపెనీలు వెనక్కి తగ్గగా... మరికొన్ని మందకొడిగా సాగుతున్నాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐరోపా దేశాల అవసరాల దృష్ట్యా... పునరుత్పాదక ఇంధనంపై దృష్టి అధికమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆకాశంలో అత్యంత ఎత్తులో గాలిని ఒడిసిపట్టి, విద్యుత్ను సృష్టించటంపై దృష్టిసారిస్తున్నారు. మామూలుగా సంక్రాంతికి ఎగరేసే పతంగుల్లాంటివి కాకుండా... భారీ గాలిపటాలను ఈ ప్రక్రియలో వినియోగిస్తారు. నెదర్లాండ్స్లోని డెల్ట్ఫ్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 10 చదరపు మీటర్ల గాలిపటాన్ని ఓ జనరేటర్కు అనుసంధానం చేసి... గాలిద్వారా 10 కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలిగారు. ఇది పదికుటుంబాలకు సరిపడేంత విద్యుత్. దీన్ని మునుముందు 50 కిలోవాట్లకు, ఆ పైన 100 మెగావాట్లకు పెంచి, లక్ష ఇళ్లకు విద్యుత్ అందివ్వాలన్నది వారి యోచన. ఈ ప్రయోగానికి లాడర్మిల్ అని పేరుపెట్టారు. గతంలో ఈ ప్రాజెక్టుకు సారథ్యం వహించిన నెదార్లండ్స్ మాజీ వ్యోమగామి వుబూ ఓకల్స్ ‘‘ప్రకృతి మనకందిస్తున్న అన్నిరకాల ఇంధనాలను వినియోగించుకోవాలి. ఈ దిశలో గాలిపటాలు అత్యంత చవకైనవి. ఆకర్షణీయమైనవి’’ అని అనేవారు.గూగుల్ కూడా మొదట్లో 10 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మకాని అనే సంస్థను నెలకొల్పి ఈ పునరుత్పాదక ఇంధన ప్రయోగాల్లో భాగమైంది. చిన్న విమానం సైజులో ఎగిరే ఇంధనప్లాంట్ను తయారు చేసి 300 మీటర్ల ఎత్తులో విద్యుత్ను ఉత్పత్తి చేసింది. ఇది 300 ఇళ్లకు సరిపోతుంది. పరిశోధనల సమయంలోనే ఈ ఇంధనప్లాంట్ సముద్రంలో కూలిపోయింది. తర్వాత గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. కానీ చాలా కంపెనీలకు మకాని ప్రయోగం ఉత్ప్రేరకమైంది. ప్రస్తుతం జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన కంపెనీలు, స్టార్టప్లు అత్యంత ఎత్తులో గాలిని ఒడిసి పట్టుకొని... గాలిపటాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయటానికి ముందుకొస్తున్నాయి. జర్మన్ కంపెనీ స్కైసెయిల్స్ పవర్... తూర్పు ఆఫ్రికాలోనూ ఈ ఎత్తైన పవన విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఒక్కో గాలిపటం...500 ఇళ్లకు సరిపడా విద్యుత్ను అందిస్తుందన్నది అంచనా. ఇందుకోసం... సంప్రదాయ పవన విద్యుత్లో వాడేవాటికంటే 90శాతం తక్కువ పరికరాలు చాలన్నది ఆ కంపెనీ ధీమా.
‘‘ఈ భూమిపై ప్రతి ఒక్కరికీ అవసరమైనదానికంటే 100 రెట్లు ఎక్కువ ఇంధనం గాలిలో ఉంది. కానీ అది అత్యంత ఎత్తులో ఉంది. దాన్ని మనం వినియోగించుకోవటం లేదు’’
- కెన్ కాల్డైరా, పర్యావరణ శాస్త్రవేత్త స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం
- మొరిజ్ డీల్, ఆచార్యుడు, ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్
ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ కొత్త ప్రయోగం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటానికి మరికొన్నేళ్లు పట్టొచ్చు. ‘‘ప్రస్తుతం మనం చూస్తున్న పవన విద్యుత్ ఈ స్థాయికి చేరుకోవటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అత్యంత ఎత్తులో గాలి ద్వారా గాలిపటాల రూపంలో విద్యుత్ను తయారు చేయటానికి కూడా కొన్నేళ్లు పడుతుంది’’ అని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పరిశోధకులు రిషికేశ్ జోషి వ్యాఖ్యానించారు. ఈ ప్రయోగాలన్నీ ప్రస్తుత పవన విద్యుత్తుకు అదనమే తప్ప... ప్రత్యామ్నాయం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్