గాలిపటంతో ‘ఇంటికి’ కరెంట్!
సరదాగా ఎగరేసుకునే పతంగితో ఇంటికి కావల్సిన కరెంటును సృష్టించొచ్చు! ఎంచక్కా కరెంటు బిల్లుల ఖర్చు తగ్గించుకోవచ్చు! ఇదేమీ పరాచికానికి చెబుతున్నది కాదు.
సరదాగా ఎగరేసుకునే పతంగితో ఇంటికి కావల్సిన కరెంటును సృష్టించొచ్చు! ఎంచక్కా కరెంటు బిల్లుల ఖర్చు తగ్గించుకోవచ్చు! ఇదేమీ పరాచికానికి చెబుతున్నది కాదు. పచ్చినిజం! పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఇదో మార్గమంటున్నారు శాస్త్రవేత్తలు!
గాలి ద్వారా కరెంటు ఉత్పత్తి (పవన విద్యుత్) ఇప్పటికే ఉన్నదే. భూమిపై 80 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే గాలిమర (విండ్ టర్బైన్స్)ల ద్వారా పవన విద్యుత్ను తయారు చేస్తున్నారు. అయితే భూమి మీదికంటే 200 మీటర్లపైన (656 అడుగులపైన) ఎత్తులో గాలులు మరింత స్థిరంగా, బలంగా వీస్తాయని... వాటి ద్వారా మరింత ఎక్కువ విద్యుత్ సృష్టించవచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. భూమ్మీద పవన విద్యుత్ కంటే పైన ఎత్తులో వీచే రెట్టింపుగాలితో ఎనిమిదింతలు ఎక్కువ విద్యుత్ను తయారు చేయవచ్చంటున్నారు.
ఈ ప్రక్రియపై పరిశోధనలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. భారీ ఖర్చుతో కూడుకొని ఉండటంతో కొన్ని కంపెనీలు వెనక్కి తగ్గగా... మరికొన్ని మందకొడిగా సాగుతున్నాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐరోపా దేశాల అవసరాల దృష్ట్యా... పునరుత్పాదక ఇంధనంపై దృష్టి అధికమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆకాశంలో అత్యంత ఎత్తులో గాలిని ఒడిసిపట్టి, విద్యుత్ను సృష్టించటంపై దృష్టిసారిస్తున్నారు. మామూలుగా సంక్రాంతికి ఎగరేసే పతంగుల్లాంటివి కాకుండా... భారీ గాలిపటాలను ఈ ప్రక్రియలో వినియోగిస్తారు. నెదర్లాండ్స్లోని డెల్ట్ఫ్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 10 చదరపు మీటర్ల గాలిపటాన్ని ఓ జనరేటర్కు అనుసంధానం చేసి... గాలిద్వారా 10 కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలిగారు. ఇది పదికుటుంబాలకు సరిపడేంత విద్యుత్. దీన్ని మునుముందు 50 కిలోవాట్లకు, ఆ పైన 100 మెగావాట్లకు పెంచి, లక్ష ఇళ్లకు విద్యుత్ అందివ్వాలన్నది వారి యోచన. ఈ ప్రయోగానికి లాడర్మిల్ అని పేరుపెట్టారు. గతంలో ఈ ప్రాజెక్టుకు సారథ్యం వహించిన నెదార్లండ్స్ మాజీ వ్యోమగామి వుబూ ఓకల్స్ ‘‘ప్రకృతి మనకందిస్తున్న అన్నిరకాల ఇంధనాలను వినియోగించుకోవాలి. ఈ దిశలో గాలిపటాలు అత్యంత చవకైనవి. ఆకర్షణీయమైనవి’’ అని అనేవారు.గూగుల్ కూడా మొదట్లో 10 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మకాని అనే సంస్థను నెలకొల్పి ఈ పునరుత్పాదక ఇంధన ప్రయోగాల్లో భాగమైంది. చిన్న విమానం సైజులో ఎగిరే ఇంధనప్లాంట్ను తయారు చేసి 300 మీటర్ల ఎత్తులో విద్యుత్ను ఉత్పత్తి చేసింది. ఇది 300 ఇళ్లకు సరిపోతుంది. పరిశోధనల సమయంలోనే ఈ ఇంధనప్లాంట్ సముద్రంలో కూలిపోయింది. తర్వాత గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. కానీ చాలా కంపెనీలకు మకాని ప్రయోగం ఉత్ప్రేరకమైంది. ప్రస్తుతం జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన కంపెనీలు, స్టార్టప్లు అత్యంత ఎత్తులో గాలిని ఒడిసి పట్టుకొని... గాలిపటాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయటానికి ముందుకొస్తున్నాయి. జర్మన్ కంపెనీ స్కైసెయిల్స్ పవర్... తూర్పు ఆఫ్రికాలోనూ ఈ ఎత్తైన పవన విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఒక్కో గాలిపటం...500 ఇళ్లకు సరిపడా విద్యుత్ను అందిస్తుందన్నది అంచనా. ఇందుకోసం... సంప్రదాయ పవన విద్యుత్లో వాడేవాటికంటే 90శాతం తక్కువ పరికరాలు చాలన్నది ఆ కంపెనీ ధీమా.
‘‘ఈ భూమిపై ప్రతి ఒక్కరికీ అవసరమైనదానికంటే 100 రెట్లు ఎక్కువ ఇంధనం గాలిలో ఉంది. కానీ అది అత్యంత ఎత్తులో ఉంది. దాన్ని మనం వినియోగించుకోవటం లేదు’’
- కెన్ కాల్డైరా, పర్యావరణ శాస్త్రవేత్త స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం
- మొరిజ్ డీల్, ఆచార్యుడు, ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్
ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ కొత్త ప్రయోగం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటానికి మరికొన్నేళ్లు పట్టొచ్చు. ‘‘ప్రస్తుతం మనం చూస్తున్న పవన విద్యుత్ ఈ స్థాయికి చేరుకోవటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అత్యంత ఎత్తులో గాలి ద్వారా గాలిపటాల రూపంలో విద్యుత్ను తయారు చేయటానికి కూడా కొన్నేళ్లు పడుతుంది’’ అని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పరిశోధకులు రిషికేశ్ జోషి వ్యాఖ్యానించారు. ఈ ప్రయోగాలన్నీ ప్రస్తుత పవన విద్యుత్తుకు అదనమే తప్ప... ప్రత్యామ్నాయం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్