నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించిన రష్యా
శత్రు నౌకలను ధ్వంసం చేయగల రెండు మోస్కిట్ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా ప్రకటించింది.
మాస్కో: శత్రు నౌకలను ధ్వంసం చేయగల రెండు మోస్కిట్ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా ప్రకటించింది. ఇవి వంద కిలోమీటర్లు ప్రయాణించి.. జపాన్ సముద్రంలో లక్ష్యంగా నిర్దేశించిన రెండు నౌకలను ధ్వంసం చేశాయి. ఈ అస్త్రాలు సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లగలవు. సంప్రదాయ, అణు వార్హెడ్లను మోసుకెళ్లగలవు. జపాన్ సముద్రంలోని పీటర్ ద గ్రేట్ గల్ఫ్లో ఈ పరీక్షలు జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది జపాన్లోని హొక్కాయిడో దీవికి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జపోరిజియా అణు కర్మాగారానికి పెరుగుతున్న ముప్పు..
రష్యాతో జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్లోని జపోరిజియా అణు విద్యుత్ కర్మాగారానికి పెను ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రఫీల్ మారియానో గ్రాస్సీ పేర్కొన్నారు. కర్మాగారానికి సమీపంలో ఘర్షణలు తీవ్రమయ్యాయని చెప్పారు. దీని రక్షణకు ఒక ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు.
ఉక్రెయిన్ చేరిన లెపర్డ్ ట్యాంకులు..
జర్మనీ నుంచి అత్యాధునిక లెపర్డ్-2 యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్కు అందడం మొదలైంది. వీటి వినియోగంపై ఉక్రెయిన్ సైనికులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. దీనిపై జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ మాట్లాడుతూ ఈ ట్యాంకులు యుద్ధంలో నిర్ణయాత్మక పాత్రను పోషించనున్నాయని పేర్కొన్నారు. మరోవైపు బ్రిటన్ నుంచి ఛాలెంజర్-2 ట్యాంకులు కూడా ఇప్పటికే ఉక్రెయిన్కు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.