సంక్షిప్త వార్తలు
కొవిడ్ను కలిగించే సార్స్కోవ్2 వైరస్తో పాటు దాని రూపాంతరాలైన డెల్టా, ఒమిక్రాన్ల పనిపట్టే మాలిక్యూల్(అణువు)ను అమెరికాలోని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు.
కొవిడ్పై ‘అణ్వ’స్త్రం
హ్యూస్టన్: కొవిడ్ను కలిగించే సార్స్కోవ్2 వైరస్తో పాటు దాని రూపాంతరాలైన డెల్టా, ఒమిక్రాన్ల పనిపట్టే మాలిక్యూల్(అణువు)ను అమెరికాలోని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. ఫైజర్ సంస్థ విడుదలచేసిన ప్యాక్స్లోవిడ్ మాత్రలను కొవిడ్ లక్షణాలు కనిపించిన మొదటి మూడు రోజుల్లో వాడితేనే ఫలితం కనిపిస్తుంది. హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు కనిపెట్టిన సి.డి.04872ఎస్.సి. మాలిక్యూల్ కొవిడ్ కారక వైరస్పై తక్షణం పనిచేసి దాని ఆటకట్టిస్తుంది. ఇది అన్ని వయసులవారికీ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా టీకాలు తీసుకున్నా తగు సంఖ్యలో యాంటీబాడీలు ఉత్పన్నంకాని దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు, వృద్ధులకు గొప్ప రక్షా కవచంలా నిలుస్తుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న రోజుల్లో హ్యూస్టన్ బృందం పరిశోధకులు వైరస్ను అడ్డుకోగల మాలిక్యూల్ కోసం 15,09,984 రసాయనాలను గాలించారు. చివరకు కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్కూ మానవ శరీరంలోని ఏస్ 2 రిసెప్టర్కూ మధ్య లంకె ఏర్పడకుండా నిరోధించగల 15 మాలిక్యూల్స్ను వడపోశారు. వాటన్నింటిలోకీ సి.డి.04872ఎస్.సి. అత్యంత సమర్థంగా లంకెను తెగ్గొడుతుందని నిర్ధారించారు.
బ్రెజిల్లో 7 లక్షలు దాటిన కొవిడ్ మరణాలు
సావొపాలో: కొవిడ్ మరణాల్లో బ్రెజిల్ ప్రపంచ దేశాల్లో రెండో స్థానానికి చేరింది. అక్కడ కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 7 లక్షలు దాటినట్లు బ్రెజిల్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 11 లక్షలకుపైగా మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకోని కారణంగానే ప్రస్తుతం బ్రెజిల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య మంత్రి నిసియా ట్రిండాడే విజ్ఞప్తి చేశారు.
హెచ్-1బి, ఎల్-1 వీసాల సంస్కరణకు అమెరికాలో సవరణ చట్టం
వాషింగ్టన్: విదేశీ ఉద్యోగుల నియామకాల కోసం ఉద్దేశించిన హెచ్-1బి, ఎల్-1 వీసాల తీరును సంస్కరించడంతో పాటు వీటి మంజూరులో మరింత పారదర్శకతను పెంచేందుకు అమెరికా సెనెట్లో కొందరు సభ్యులు సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా సెనెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్-1బి, ఎల్-1 వీసాల సంస్కరణ చట్టం ఇమ్మిగ్రేషన్ విధానంలోని మోసాలు, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు అమెరికాలోని ఉద్యోగులు, వీసాదారులకు రక్షణ కల్పిస్తుందని ఓ మీడియా తెలిపింది.
పురుష శరణార్థులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్న గార్డులు
మెక్సికో అగ్నిప్రమాద ఘటనపై బాధితుల ఆరోపణలు
మెక్సికో సిటీ: మెక్సికో-అమెరికా సరిహద్దు నగరం సియూడడ్ వారెజ్లోని శరణార్థుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై బాధితులు పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు గార్డులు మహిళా శరణార్థులను బయటకు వెళ్లడానికి అనుమతించినప్పటికీ పురుషులు ఉన్న సెల్ను మాత్రం తెరవలేదని బాధితులు వాపోయారు. దీంతో ఆ గదులు మొత్తం పొగతో నిండిపోయి వారంతా మరణించారని ప్రమాదం నుంచి బయటపడిన వియాంగ్లీ ఇన్ఫాంటే పాడ్రోన్ అనే మహిళ తెలిపారు. ప్రమాదం సంభవించిన తొలి నిమిషాల్లో బయటకు పరుగు పరుగున వచ్చింది మహిళలు, ఇమిగ్రేషన్ ఉద్యోగులేనని ఆమె తెలిపారు. ఇమిగ్రేషన్ అధికారులు సైతం తమ ప్రకటనలో పురుష శరణార్థుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రమాదంలో ఉన్నది నిందితులా, దోషులా, వారు పారిపోతారా లేదా అనే అంశాలతో సంబంధం లేకుండా అందరినీ కాపాడి ఉండాల్సిందని మానవహక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 38 మంది మరణించగా 28 మంది గాయాలపాలయ్యారు. మరోవైపు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కోసం పోప్ ఫ్రాన్సిస్ బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. -
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు