రష్యా అణు విన్యాసాలు!
ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా కీలక అడుగులు వేసింది. సైబీరియా ఎడారిలో బుధవారం అణు విన్యాసాలు ప్రారంభించింది. వ్యూహాత్మక క్షిపణి దళాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి.
సైబీరియా ఎడారిలో ఖండాంతర క్షిపణులతో పరీక్షలు
క్షిపణి ప్రయోగ వివరాలు అమెరికాతో పంచుకోబోమని ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా కీలక అడుగులు వేసింది. సైబీరియా ఎడారిలో బుధవారం అణు విన్యాసాలు ప్రారంభించింది. వ్యూహాత్మక క్షిపణి దళాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి. ఇందులో దేశ అణు సత్తాను అధ్యక్షుడు పుతిన్ స్వయంగా పరీక్షించనున్నారు. ఈ విన్యాసాల్లో 12 వేల కిలోమీటర్ల దూరం దూసుకెళ్లే యార్స్ ఖండాంతర క్షిపణులూ పాల్గొనడం గమనార్హం. వీటికి వివిధ రకాల అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉంది. ‘‘మొత్తం మీద 3 వేల మంది సైనిక సిబ్బందితో పాటు 300 వాహనాలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటాయి’’ అని రష్యా రక్షణశాఖ బుధవారం తెలిపింది. ట్రక్కులపై వెళుతున్న ఖండాంతర క్షిపణుల చిత్రాలను కూడా విడుదల చేసింది. మొత్తం మూడు ప్రాంతాల్లో యార్స్ సంచార వ్యవస్థలు తమ పాటవాన్ని చూపనున్నాయని సమాచారం. ప్రాంతాల పేర్లను మాత్రం మాస్కో వెల్లడించలేదు. ఈ సందర్భంగా క్షిపణి ప్రయోగాలు ఉంటాయా లేదా అన్న విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. అయితే క్షిపణి పరీక్షలకు సంబంధించి అమెరికాతో ఇక ఎలాంటి సమాచారం పంచుకోబోమని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని రష్యా ఉప విదేశాంగమంత్రి సెర్గీ రిబకోవ్ కూడా ధ్రువీకరించారు. గతంలో ఎలాంటి ప్రయోగాలు చేసినా మాస్కో, వాషింగ్టన్లు సమాచారం పంచుకొనేవి. అయితే గత నెల న్యూస్టార్ట్ అణ్వాయుధ ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అగ్రరాజ్యానికి ఎలాంటి సమాచారం అందించడం లేదని మంత్రి స్పష్టం చేశారు.
పుతిన్కు చిన్న విజయం దక్కినా ప్రమాదకరమే: జెలెన్స్కీ
కీవ్: ప్రస్తుత యుద్ధంలో రష్యా సాధించే చిన్న విజయం కూడా అత్యంత ప్రమాదకరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఆయన ఏపీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాన్బాస్లోని బఖ్ముత్లో జరుగుతున్న పోరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఒకవేళ అక్కడ రష్యా గెలుపు సాధిస్తే.. దాన్ని పాశ్చాత్య దేశాలకు, రష్యా సమాజానికి, చైనాకు, ఇరాన్కు పుతిన్ అమ్మే ప్రయత్నం చేస్తాడు. అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టి అంగీకారయోగ్యం కాని షరతులుకు ఉక్రెయిన్ను ఒప్పించేలా ఒత్తిడి తెస్తాడు. పుతిన్ ప్రమాదకారి. కాస్త రక్తం రుచి మరిగినా, మేం బలహీనంగా ఉన్నామని పసిగట్టినా.. ఇంకా మమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తాడు’’ అని జెలెన్స్కీ తెలిపారు. ఇటీవల రష్యాలో పర్యటించిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రస్తావన కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు తెచ్చారు. తాను జిన్పింగ్తో మాట్లాడాలనుకుంటున్నానని తెలిపారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా చైనా నేతను జెలెన్స్కీ ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు