రష్యా అణు విన్యాసాలు!
ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా కీలక అడుగులు వేసింది. సైబీరియా ఎడారిలో బుధవారం అణు విన్యాసాలు ప్రారంభించింది. వ్యూహాత్మక క్షిపణి దళాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి.
సైబీరియా ఎడారిలో ఖండాంతర క్షిపణులతో పరీక్షలు
క్షిపణి ప్రయోగ వివరాలు అమెరికాతో పంచుకోబోమని ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా కీలక అడుగులు వేసింది. సైబీరియా ఎడారిలో బుధవారం అణు విన్యాసాలు ప్రారంభించింది. వ్యూహాత్మక క్షిపణి దళాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి. ఇందులో దేశ అణు సత్తాను అధ్యక్షుడు పుతిన్ స్వయంగా పరీక్షించనున్నారు. ఈ విన్యాసాల్లో 12 వేల కిలోమీటర్ల దూరం దూసుకెళ్లే యార్స్ ఖండాంతర క్షిపణులూ పాల్గొనడం గమనార్హం. వీటికి వివిధ రకాల అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉంది. ‘‘మొత్తం మీద 3 వేల మంది సైనిక సిబ్బందితో పాటు 300 వాహనాలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటాయి’’ అని రష్యా రక్షణశాఖ బుధవారం తెలిపింది. ట్రక్కులపై వెళుతున్న ఖండాంతర క్షిపణుల చిత్రాలను కూడా విడుదల చేసింది. మొత్తం మూడు ప్రాంతాల్లో యార్స్ సంచార వ్యవస్థలు తమ పాటవాన్ని చూపనున్నాయని సమాచారం. ప్రాంతాల పేర్లను మాత్రం మాస్కో వెల్లడించలేదు. ఈ సందర్భంగా క్షిపణి ప్రయోగాలు ఉంటాయా లేదా అన్న విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. అయితే క్షిపణి పరీక్షలకు సంబంధించి అమెరికాతో ఇక ఎలాంటి సమాచారం పంచుకోబోమని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని రష్యా ఉప విదేశాంగమంత్రి సెర్గీ రిబకోవ్ కూడా ధ్రువీకరించారు. గతంలో ఎలాంటి ప్రయోగాలు చేసినా మాస్కో, వాషింగ్టన్లు సమాచారం పంచుకొనేవి. అయితే గత నెల న్యూస్టార్ట్ అణ్వాయుధ ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అగ్రరాజ్యానికి ఎలాంటి సమాచారం అందించడం లేదని మంత్రి స్పష్టం చేశారు.
పుతిన్కు చిన్న విజయం దక్కినా ప్రమాదకరమే: జెలెన్స్కీ
కీవ్: ప్రస్తుత యుద్ధంలో రష్యా సాధించే చిన్న విజయం కూడా అత్యంత ప్రమాదకరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఆయన ఏపీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాన్బాస్లోని బఖ్ముత్లో జరుగుతున్న పోరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఒకవేళ అక్కడ రష్యా గెలుపు సాధిస్తే.. దాన్ని పాశ్చాత్య దేశాలకు, రష్యా సమాజానికి, చైనాకు, ఇరాన్కు పుతిన్ అమ్మే ప్రయత్నం చేస్తాడు. అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టి అంగీకారయోగ్యం కాని షరతులుకు ఉక్రెయిన్ను ఒప్పించేలా ఒత్తిడి తెస్తాడు. పుతిన్ ప్రమాదకారి. కాస్త రక్తం రుచి మరిగినా, మేం బలహీనంగా ఉన్నామని పసిగట్టినా.. ఇంకా మమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తాడు’’ అని జెలెన్స్కీ తెలిపారు. ఇటీవల రష్యాలో పర్యటించిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రస్తావన కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు తెచ్చారు. తాను జిన్పింగ్తో మాట్లాడాలనుకుంటున్నానని తెలిపారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా చైనా నేతను జెలెన్స్కీ ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ