జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకోవచ్చు
అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ ఉద్యోగాలు చేయకుండా అడ్డుకోవాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వేసిన పిటిషన్ను అమెరికా కోర్టు కొట్టివేసింది.
హెచ్-1బి వీసాదారులకు సంబంధించి అమెరికా కోర్టు కీలక తీర్పు
వాషింగ్టన్: అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ ఉద్యోగాలు చేయకుండా అడ్డుకోవాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వేసిన పిటిషన్ను అమెరికా కోర్టు కొట్టివేసింది. హెచ్-1బి వీసాదారుల భార్య/భర్త అమెరికాలో నిరభ్యంతరంగా పనిచేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే ఉంటారు. ఇటీవల సాఫ్ట్వేర్ రంగంలో లేఆఫ్ల కారణంగా భారీస్థాయిలో ఉద్యోగాలను కోల్పోయిన నేపథ్యంలో ఈ తీర్పుతో సాంత్వన లభించింది. హెచ్-1బి వీసాలపై అమెరికా వచ్చే ఉద్యోగుల భాగస్వాములు (హెచ్-4 వీసాదారులు) కూడా అక్కడ పనిచేసుకునేలా ఒబామా హయాంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమెరికా ఇప్పటివరకు హెచ్-4 వీసాదారులకు లక్ష వర్క్ ఆథరైజేషన్లు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేసింది. హెచ్1-బి వీసాదారుల కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆ సంస్థ వాదిస్తోంది. అయితే ఈ పిటిషన్ను న్యాయమూర్తి తాన్యా ఛుట్కన్ కొట్టివేశారు. ‘‘హెచ్-4 వీసాదారులు అమెరికాలో పని చేసుకోవడానికి అనుమతి ఇవ్వడానికి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అథారిటీకి అమెరికా కాంగ్రెస్(పార్లమెంటు) అధికారం కట్టబెట్టలేదని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ తన వ్యాజ్యంలో ప్రధానంగా పేర్కొంది. కానీ, ఈ వాదన దశాబ్దాలుగా కాంగ్రెస్ అనుమతులతో కార్యనిర్వాహక శాఖ చేస్తున్న పనికి విరుద్ధంగా ఉంది. హెచ్-4 వీసాదారులకు పనిచేసుకునే అవకాశం కల్పించేందుకు అమెరికా ప్రభుత్వానికి కాంగ్రెస్ స్పష్టమైన అధికారం ఇచ్చింది. ఈ వీసాదారులకు ఉపాధి కల్పించే బాధ్యత సమాఖ్య ప్రభుత్వానికి ఉంది. అందుకే విద్యార్థులకే కాకుండా హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు, వారిపై ఆధారపడిన వారికి కూడా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అథారిటీ ఉద్యోగాలను కల్పిస్తూ వస్తోంది. అలాగే విదేశీ ప్రభుత్వాల అధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా దీర్ఘకాలిక ఉపాధిని చూపుతోంది’’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుపై తాము అప్పీలుకు వెళ్లనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత