ఓడలో అగ్నిప్రమాదం.. 31 మంది మృతి
దక్షిణ ఫిలిప్పీన్స్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓడలో మంటలు చెలరేగడంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫిలిప్పీన్స్లో దుర్ఘటన
మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓడలో మంటలు చెలరేగడంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. 23 మంది గాయపడ్డారు. బాసిలన్ ప్రావిన్సులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జాంబోంగా నుంచి సులు ప్రావిన్స్లోని జోలో పట్టణానికి ఓడ వెళ్తుండగా అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. భయాందోళనలకు లోనై నీటిలో పడి కొందరు.. అగ్నికీలల్లో చిక్కుకుని మరికొందరు మరణించారు. ప్రాణభయంతో నీటిలో దూకినవారిలో చాలా మందిని నేవీ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు రక్షించారు. దగ్ధమైన ఓడను బాసిలన్ తీరానికి అధికారులు చేర్చారు. ఓడ క్యాబిన్లో 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mamata Banerjee: రైల్వే నా బిడ్డవంటిది.. ఈ ప్రమాదం 21వ శతాబ్దపు అతి పెద్ద ఘటన
-
India News
Odisha Train Tragedy: భారత్కు అండగా ఉన్నాం.. రైలు ప్రమాదంపై ప్రపంచ నేతలు!
-
India News
Odisha Train Tragedy: కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రాక్ మారడం వల్లే.. రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక
-
Movies News
Punch Prasad: పంచ్ ప్రసాద్కు తీవ్ర అనారోగ్యం.. సాయం కోరుతూ వీడియో
-
India News
Train tragedies: భారతీయ రైల్వేలో.. మహా విషాదాలు!
-
General News
Odisha Train Tragedy: అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయాలని సీఎం ఆదేశించారు: మంత్రి అమర్నాథ్