ఆ అణు అడుగుల వెనుక.. నాటో దేశాలపై రష్యా ‘వ్యూహాత్మక’ ఒత్తిడి
ఇన్నాళ్లూ సంప్రదాయ ఆయుధాలు, యుద్ధట్యాంకులకే పరిమితమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తొలిసారి అణు అడుగులు పడుతున్నాయి.
ఇన్నాళ్లూ సంప్రదాయ ఆయుధాలు, యుద్ధట్యాంకులకే పరిమితమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తొలిసారి అణు అడుగులు పడుతున్నాయి. రష్యా తన వ్యూహాత్మక అణ్వస్త్రాలు కొన్నింటిని బెలారస్కు తరలించనున్నట్లు ప్రకటించింది. నాటో కూటమిలో ఇది కలకలం రేపుతోంది. ఇంతకూ ఏంటీ వ్యూహాత్మక అణ్వస్త్రాలు? ఎందుకోసం వీటిని రష్యా బెలారస్కు పంపిస్తోంది? నాటో ఎందుకని ఉలిక్కిపడుతోంది?
బ్రిటన్ నిర్ణయంతో...
మా దేశ భూభాగాన్ని కాపాడుకోవటం కోసం ‘అన్ని మార్గాలనూ’ అనుసరిస్తాం... అంటూ హెచ్చరించిన కొద్దిరోజులకే రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట వ్యూహాత్మక అణ్వస్త్రాల ప్రకటన వెలువడింది. తమ వ్యూహాత్మక అణ్వస్త్రాలను బెలారస్లో మోహరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు కారణం ఇబ్బడిముబ్బడిగా నాటో దేశాల నుంచి ఉక్రెయిన్కు ఆయుధ సాయం అందుతుండటమే. తమపై దాడి చేయటానికి వీలుగా అత్యాధునిక యుద్ధట్యాంకులను ఉక్రెయిన్కు ఇవ్వటానికి జర్మనీ, అమెరికా అంగీకరించాయి. వీటికి తోడు... తాజాగా క్షీణించిన యురేనియంతో కూడిన మందుగుండు సామగ్రిని ఉక్రెయిన్కు సరఫరా చేసేందుకు బ్రిటన్ నిర్ణయించింది.
ఏమిటీ వ్యూహాత్మక అణ్వస్త్రాలు?
ప్రత్యర్థి శిబిరాలు, ఆయుధాలను నాశనం చేసేవే ఈ వ్యూహాత్మక అణ్వస్త్రాలు. మామూలు పూర్తిస్థాయి అణ్వస్త్రాలైతే సుదూర లక్షిత క్షిపణులకు అనుసంధానితమై భారీ విధ్వంసం సృష్టిస్తాయి. వీటిని భూమిపై లేదా సబ్మెరైన్లపై ఖండాంతర క్షిపణులకు అనుసంధానించి ఉంచుతారు. పట్టణాలకు పట్టణాలనే ధ్వంసం చేయగలుగుతాయి. వాటితో పోల్చుకుంటే ఈ వ్యూహాత్మక అస్త్రాలు అల్పప్రభావితాలు! వీటిలో ఎయిర్క్రాఫ్ట్ల్లో మోసుకెళ్లే బాంబులు, స్వల్పలక్షిత వార్హెడ్లు, క్షిపణులు తదితరాలుంటాయి. మామూలు అణ్వస్త్రాల వాడకంపై రష్యా-అమెరికా మధ్య అనేక ఒప్పందాలున్నాయి. వాటిని ఉల్లంఘించి వినియోగించటం చాలా కష్టం. కానీ ఈ వ్యూహాత్మక అస్త్రాలు ఆ ఒప్పందాల పరిధిలోకి రావు. అసలివి ఎవరి వద్ద ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. రష్యా వద్ద సుమారు 2వేల దాకా వ్యూహాత్మక అణ్వస్త్రాలున్నట్లు అమెరికా అంచనా. వీటిని అత్యంత సురక్షిత ప్రాంతంలో దాచి ఉంచుతారు. ఒకచోటి నుంచి మరోచోటికి సరఫరా చేయటానికి సమయం పడుతుంది. బెలారస్లో వీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 1కల్లా ఇవి పూర్తవుతాయని పుతిన్ పేర్కొనటం గమనార్హం. అంతేగాకుండా ఏప్రిల్ 3 నుంచి బెలారస్ వాయుసేన సిబ్బందికి అణ్వస్త్రాలను మోసుకుపోయే శిక్షణ కూడా రష్యా ఇవ్వబోతోంది.
రష్యాకిదే తొలిసారి..
ఇలా ఒకదేశం తమ అణ్వస్త్రాలను ఇతర దేశాలకు తరలించటం కొత్తేమీ కాదు. అమెరికా ఇప్పటిదాకా తన అణ్వస్త్రాలను బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీల్లో మోహరించింది. రష్యా తొలిసారిగా తన సరిహద్దులను దాటించి బెలారస్కు పంపిస్తోంది. నిజానికి 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత బెలారస్, ఉక్రెయిన్, కజకిస్థాన్ల చేతిలో భారీస్థాయిలో అణ్వస్త్రాలున్నాయి. అవన్నీ ఒప్పందాల కారణంగా... రష్యాకు చేరుకున్నాయి.
బెలారసే ఎందుకు?
తమ వ్యూహాత్మక అణ్వస్త్రాలను బెలారస్లోనే మోహరించాలని పుతిన్ నిర్ణయించుకోవటం వెనక కారణముంది. ఒకనాటి సోవియట్లో భాగమై... తర్వాత స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన పొరుగుదేశం బెలారస్తో రష్యాకు సత్సంబంధాలున్నాయి. పైగా... ఉక్రెయిన్తో 1084 కిలోమీటర్ల మేర బెలారస్కు సరిహద్దుంది. అంటే... బెలారస్ నుంచి ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాలపై దాడి చేసే అవకాశం రష్యాకుంటుంది. అంతేకాకుండా బెలారస్ గడ్డమీది నుంచి తూర్పు, సెంట్రల్ ఐరోపాలోని పలు నాటో దేశాలపైనా రష్యా గురిపెట్టగలుగుతుంది.
అణ్వస్త్రాల్లో వాడే యురేనియం కంటే తక్కువమోతాదు యురేనియంతో కూడిన మందుగుండును ఉక్రెయిన్కు ఇవ్వాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం పుతిన్ను వ్యూహాత్మక అణ్వస్త్రాల దిశగా నడిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.
బెలారస్లో అణ్వస్త్రాలను మోహరించటం ద్వారా... పుతిన్ నాటో దేశాలపై పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఉక్రెయిన్కు మద్దతు విషయంలో దూకుడు ప్రదర్శించకుండా పాశ్చాత్యదేశాలకు ముకుతాడు వేసే ఎత్తుగడలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని నిపుణుల భావన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు