జైలుకెళ్లినా పోటీ చేయొచ్చు!
పోర్న్ స్టార్కు ముడుపుల వ్యవహారంలో అభియోగాలు నమోదైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం ఏంటి? 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాటపడుతున్న.
ట్రంప్ 2024 ఆశలకు ఇబ్బందేమీ లేదు
వాషింగ్టన్: పోర్న్ స్టార్కు ముడుపుల వ్యవహారంలో అభియోగాలు నమోదైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం ఏంటి? 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాటపడుతున్న ఆయన ఆశలిక అడియాసలైనట్లేనా? పోటీకి దూరంగా ఉండాల్సిందేనా? అంటే... అదేం లేదనే సమాధానం వస్తోంది. నేరం రుజువై జైలుకెళ్లినా అధ్యక్ష పదవికి అర్హుడే అంటోంది అమెరికా రాజ్యాంగం!
పరువు నష్టం కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష పడగానే మన దగ్గర రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం తక్షణమే రద్దయింది. అంతేకాదు.. ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యారాయన! మరి పోర్న్ స్టార్కు ముడుపుల కేసులో కోర్టు ముందు లొంగిపోబోతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవటం సహజం.
ఆ మూడూ ఉంటే చాలు...
ప్రస్తుతానికి ట్రంప్ క్రిమినల్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం... క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని ఎక్కడా లేదు. కేవలం కేసులు ఎదుర్కోవడమే కాదు.. ఆ కేసుల్లో దోషిగా తేలి, జైలు శిక్ష పడ్డా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే... మూడు అర్హతలు కీలకం.
1. ఆ దేశంలో పుట్టిన పౌరుడై ఉండాలి.
2. వయసు 35 ఏళ్లు నిండాలి.
3. పోటీ చేసే నాటికి అమెరికాలో కనీసం 14 ఏళ్లు నివసించాలి.
ఈ మూడూ ఉన్నవారెవరైనా అధ్యక్ష ఎన్నికకు పోటీ చేయొచ్చు. క్రిమినల్ కేసులున్నా, కేసుల్లో శిక్ష పడ్డా... జైలులో ఉన్నా పోటీ చేయొచ్చు. క్రిమినల్ కేసుల్లో శిక్ష అనేది అధ్యక్ష పదవికి అనర్హత కానే కాదు. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం... దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినవారు మాత్రమే పోటీకి అనర్హులు.
సానుభూతికి వాడుకునే అవకాశం
పోర్న్ స్టార్ కేసువల్ల సాంకేతికంగానైతే 2024 ఎన్నికల్లో పోటీ చేయటానికి ట్రంప్నకు ఎలాంటి ఇబ్బందీ లేదు. నైతికంగా రిపబ్లికన్ పార్టీ ఆయనను అభ్యర్థిగా నిలబెడుతుందా అనేది ఆసక్తికరం.. ప్రస్తుతానికైతే ఈ కేసు విషయంలో రిపబ్లికన్ పార్టీ నేతలంతా ఆయనకు మద్దతిస్తున్నారు. అధ్యక్ష బరిలో నిలవాలని ఆశిస్తున్న నేతలూ ఈ కేసు విషయంలో ట్రంప్నకు మద్దతుగా ప్రకటనలివ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేసును తనకు అనుకూలంగా, సానుభూతి సంపాదించేలా ట్రంప్ మలచుకునే అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల మాట. ఇప్పటికే బైడెన్ సారథ్యంలోని డెమొక్రాట్లు న్యాయ వ్యవస్థను రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారని రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోంది.
ఎవరిపైనా లేనన్ని కేసులు
అమెరికా మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ కేసులో అభియోగాలు నమోదవడం ఇదే తొలిసారి. నిజానికి ట్రంప్పై ఈ కేసు ఒక్కటే కాదు. మరో మూడు క్రిమినల్ కేసుల్లోనూ ఆయన అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
1. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారన్నది ఒక ఆరోపణ. దీనిపై జార్జియాలోని ప్రత్యేక గ్రాండ్ జ్యూరీ ఇప్పటికే పలువురిపై అభియోగాలు నమోదు చేయాలని రహస్య నివేదిక సమర్పించింది.
2. పదవి నుంచి దిగిపోయే ముందు అధికార రహస్య పత్రాలను అప్పగించకుండా ఇంటికి తీసుకెళ్లారన్నది ట్రంప్పై రెండో ఆరోపణ. దీనిపై ఇప్పటికే ఎఫ్బీఐ ట్రంప్ ఇంట్లో సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. తెలిసే వీటిని ట్రంప్ తీసుకెళ్లారా? రహస్య చట్టాలకు విరుద్ధంగా కావాలనే వీటిని తనతో ఉంచుకున్నారా? దర్యాప్తును అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
3. 2020 జనవరి 6న అమెరికా కాంగ్రెస్పై రిపబ్లికన్ మూకల దాడి కేసు మూడోది. ట్రంప్ రెచ్చగొట్టినందునే ఈ దాడి జరిగిందన్నది ఆరోపణ. ఇందుకు సంబంధించి ట్రంప్ పాత్రపై సాక్ష్యాలు సేకరించడంలో అమెరికా న్యాయ విభాగం తలమునకలై ఉంది. ఇప్పటికే ప్రత్యేక కౌన్సిల్ విచారణ మొదలు పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
-
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు