ట్రంప్ సెల్ఫ్గోల్ఫ్!
అగ్రరాజ్య చరిత్రలోనే తొలిసారిగా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తున్నారు. తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన పోర్న్స్టార్ను డబ్బుతో ప్రలోభపెట్టారనేవి ఈ కేసులో ప్రధాన ఆరోపణలు.
‘టోర్నమెంట్’ సమయంలో స్టార్మీ డేనియల్స్తో పరిచయం
ఎన్నికల వేళలో ఒప్పందం
వాషింగ్టన్: అగ్రరాజ్య చరిత్రలోనే తొలిసారిగా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తున్నారు. తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన పోర్న్స్టార్ను డబ్బుతో ప్రలోభపెట్టారనేవి ఈ కేసులో ప్రధాన ఆరోపణలు. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్-పోర్న్స్టార్ మధ్య ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. స్టార్మీ డేనియల్స్ అసలు పేరు స్టిఫనీ క్లిఫర్డ్ (44). లూసియానాకు చెందిన ఆమె పలు చిత్రాల్లో నటించారు. 2006 జులైలో జరిగిన ఓ గోల్ఫ్ టోర్నమెంట్లో అమెరికా రియల్ ఎస్టేట్ దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ను తొలిసారి కలుసుకున్నట్లు ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు. ‘ఆ టోర్నమెంట్ సమయంలో బాడీగార్డు ఆహ్వానం మేరకు.. ట్రంప్తో కలిసి భోజనం చేశా. అప్పుడే తన కవర్ ఫొటోతో ఉన్న ఓ గోల్ఫ్ మ్యాగజీన్ను ట్రంప్ చూపించారు. అప్పట్లో ఓ పాపులర్ టీవీ షోను నిర్వహిస్తున్న ఆయన.. అందులో కనిపించేందుకు ఆసక్తి ఉందా? అని అడిగారు. అనంతరం మేమిద్దరం ఏకాంతంగా గడిపాం’ అని 2018లో డేనియల్స్ వెల్లడించారు. అప్పట్లో ఆమె వయసు 27 ఏళ్లు కాగా ట్రంప్ వయసు 60 సంవత్సరాలు. అప్పటికే మెలానియాను ట్రంప్ మూడో పెళ్లి చేసుకుని ఏడాది అయింది. మెలానియా తన కుమారుడు బారెన్కు జన్మనిచ్చిన 4 నెలలకే ట్రంప్- డేనియల్స్ కలుసుకున్నట్లు సమాచారం.
2007లో మరోసారి..
రియాలిటీ షోలో పాల్గొనే అంశంపై చర్చించేందుకు 2007లోనూ ట్రంప్, డేనియల్స్ లాస్ ఏంజెలెస్లో కలుసుకున్నారు. ఆ సమయంలో ఏకాంతంగా గడపాలని ట్రంప్ కోరినప్పటికీ తాను అంగీకరించలేదని డేనియల్స్ తెలిపారు. ఇది జరిగిన నెల తర్వాత ట్రంప్ నుంచి ఫోన్ వచ్చిందని.. సెలబ్రిటీ షోలో తీసుకోలేకపోతున్నామని చెప్పినట్లు ఆమె వివరించారు.డేనియల్స్ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. కేవలం డబ్బు కోసమే ఆమె ఈ ఆరోపణలు చేస్తోందని.. ఆమెతో ఎన్నడూ శృంగారంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు.
వివాదానికి కారణమైన ఒప్పందం..
2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. ఆ సమయంలోనే.. లైంగిక సంబంధాలను బయటకు పొక్కనీయకుండా డేనియల్స్ను డబ్బుతో ప్రలోభపెట్టారనేది ఆరోపణ. ఈ వ్యవహారంలో ట్రంప్ న్యాయవాది ఆమెకు 1.30 లక్షల డాలర్లు సమకూర్చి ఆమెతో (ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో) ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇది చెల్లదంటూ డేనియల్స్ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఇవే ఆరోపణలను న్యూయార్క్లోని మన్హటన్ న్యాయస్థానం ధ్రువీకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!