చైనా కట్టడికి భారత్కు సహకారం
సరిహద్దుల్లో చైనా చర్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి భారత్తో మరింత కలసికట్టుగా పని చేయాలనుకుంటున్నామని అమెరికా ఉన్నతాధికారి కుర్ట్ క్యాంప్బెల్ పేర్కొన్నారు.
డ్రాగన్ రెచ్చగొట్టే చర్యలతో యుద్ధానికి అవకాశం
భారత్కు సాంకేతికతను అందించాలి
ఆయుధ తయారీలో సహకరించుకోవాలి
అమెరికా ప్రభుత్వానికి భద్రతా సంస్థ సూచన
వాషింగ్టన్: సరిహద్దుల్లో చైనా చర్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి భారత్తో మరింత కలసికట్టుగా పని చేయాలనుకుంటున్నామని అమెరికా ఉన్నతాధికారి కుర్ట్ క్యాంప్బెల్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికి ఉప సహాయకుడు, ఇండో-పసిఫిక్ వ్యవహారాల సమన్వయకర్త అయిన ఆయన గురువారమిక్కడ సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ (సీఎన్ఏఎస్) సంస్థతో మాట్లాడారు. భారత్, అమెరికాల ద్వైపాక్షిక బంధం 21వ శతాబ్దంలో అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. అమెరికా సైనిక కూటమిలో భారత్ సభ్యురాలు కాకపోయినా తమ రెండు దేశాలు అత్యంత సన్నిహిత భాగస్వాములుగా పని చేస్తాయని క్యాంప్బెల్ వివరించారు. అమెరికన్లకు మరే ఇతర దేశ ప్రజలతోనూ లేనంత బంధం భారతీయులతో ఉందని చెప్పారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో మరింత మంది భారతీయ విద్యార్థులు చేరాలని ఆశిస్తున్నామని, అలాగే భారతీయ వర్సిటీల్లో మరింత మంది అమెరికన్ విద్యార్థులు చేరాలని కోరుకుంటున్నామని చెప్పారు. భారత్, చైనాల మధ్య 5,000 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి సంఘర్షణలు పెరుగుతున్నాయని, అవి పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని సీఎన్ఏఎస్ నివేదిక హెచ్చరించింది. సరిహద్దులో శాంతి సుస్థిరతలు నెలకొంటేనే చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని భారత విదేశాంగశాఖ తన 2022 నివేదికలో స్పష్టం చేసింది. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం సృష్టించడంద్వారా భారత్ తన వనరులను ఆ రెండు దేశాల సరిహద్దులకు మళ్లించాల్సిన ఆవశ్యకతను సృష్టించాలనేది బీజింగ్ పన్నాగమని సీఎన్ఏఎస్ నివేదిక వ్యాఖ్యానించింది. దీనివల్ల భారత్లో పోరాట సంకల్పం బలహీనపడి చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయలేకపోతుందనేది బీజింగ్ భావన అని పేర్కొంది. భారత్ తన సరిహద్దులను రక్షించుకోవడానికి అధునాతన సాంకేతికతలను అందించాలని అమెరికా ప్రభుత్వానికి సీఎన్ఏఎస్ సిఫార్సు చేసింది. సైన్యానికి కావాల్సిన ఆయుధాలను రెండు దేశాలు ఉమ్మడిగా రూపొందించి ఉత్పత్తి చేయాలని, భారతీయ నౌకా శక్తిని పటిష్ఠం చేయాలని సూచించింది. భారత్, అమెరికాలు గూఢచర్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, భారత్, చైనాల మధ్య యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే వ్యూహ రచన చేయాలని సీఎన్ఏఎస్ నివేదిక సూచించింది. భారత్, చైనాల మధ్య యుద్ధం వస్తే తటస్థంగా ఉండేలా పాకిస్థాన్కు సందేశమివ్వాలని సిఫార్సు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?