ఉప్పు వాడకం తగ్గించాల్సిందే
ఉప్పు ఎక్కువగా తీసుకొంటే మెడ, గుండెలోని రక్తనాళాలు గట్టిపడి గుండె పోటు, పక్షవాతం సంభవిస్తాయని ఐరోపా హృద్రోగ చికిత్సా నిపుణుల పత్రిక ఓపెన్లో శనివారం ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.
వాషింగ్టన్: ఉప్పు ఎక్కువగా తీసుకొంటే మెడ, గుండెలోని రక్తనాళాలు గట్టిపడి గుండె పోటు, పక్షవాతం సంభవిస్తాయని ఐరోపా హృద్రోగ చికిత్సా నిపుణుల పత్రిక ఓపెన్లో శనివారం ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. పూడిక వల్ల ధమనులు ముడుచుకుపోయి గట్టిపడే వ్యాధిని ఎథీరో స్క్లెరోసిస్ అంటారు. ఇలా పూడుకుపోయిన రక్తనాళాలు హృదయానికి, మెదడుకు తగు పరిమాణంలో రక్తాన్ని సరఫరా చేయలేకపోతాయి. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వంటివి సంభవిస్తాయి. విపరీతమైన ఉప్పు వాడకానికీ, ఎథీరో స్క్లెరోసిస్కూ మధ్య సంబంధం ఉందని మొట్టమొదటిసారి అధ్యయనం ద్వారా నిర్ధారించామని స్వీడన్కు చెందిన డాక్టర్ జోనాస్ వూపియో వివరించారు. ఉప్పు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువగా ఎథీరో స్క్లెరోసిస్ ఏర్పడుతుందన్నారు. అధిక రక్తపోటు ఏర్పడక ముందే ఉప్పు వాడకం శరీరానికి హాని కలిగించడం మొదలుపెడుతుంది. అందుకే రోజుకు ఒక చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని డబ్ల్యూహెచ్వో సలహా ఇస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా