King Charles: పట్టాభిషేకంపై భిన్నగళం!
బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవంపై బ్రిటన్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
బ్రిటన్ రాజు ఛార్లెస్ కోసం 10కోట్ల పౌండ్ల వ్యయం?
ప్రజల సొమ్ము వృథా అంటూ ధ్వజమెత్తుతున్న జనం
వేడుకతో భారీ ఆదాయం వస్తుందంటున్న మరోవర్గం
ఈనాడు ప్రత్యేక విభాగం: బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవంపై బ్రిటన్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, రెండంకెల ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధ ఫలితాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ... ఈ ఆర్భాటాలు, కోట్ల పౌండ్ల వృథా వ్యయం అవసరమా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది ఏకంగా ఈ కాలంలో రాజరికం అవసరమా అంటూ నిలదీస్తున్నారు. ఈ ఖర్చును రాజు ఛార్లెసే భరించాలని, ప్రజలు కట్టిన పన్నుల నుంచి తీసుకోవద్దనేది మరికొందరి డిమాండ్. పట్టాభిషేక వేడుక ఎంతో ఆదాయాన్నిస్తుందంటూ ఇంకొందరు సమర్థిస్తున్నారు. ఇలా భిన్న గళాలతో బ్రిటన్ మార్మోగుతోంది. ఎలిజబెత్-2 రాణి మరణంతో సెప్టెంబరులోనే ఛార్లెస్-3 ఇంగ్లాండ్ రాజుగా అధికారికంగా నియమితులయ్యారు. వచ్చే శనివారం జరగబోతున్నది పట్టాభిషేక మహోత్సవం. అంటే సంప్రదాయాలు, లాంఛనాల మధ్య ఛార్లెస్-3కి రాజ కిరీట ధారణ చేస్తారు. 70ఏళ్ల కిందట 1953లో చివరిసారి ఎలిజబెత్-2 పట్టాభిషేకం తర్వాత ఇప్పటిదాకా అలాంటి కార్యక్రమం జరగలేదు. అంటే ఈ తరం రాజ కుటుంబ కిరీట ధారణను చూడలేదు. చాలా మందిలో ఆ కార్యక్రమం, సంప్రదాయాల పట్ల ఆసక్తి ఉన్నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎక్కువ మందిలో విముఖత వ్యక్తం అవుతుండటం గమనార్హం. దీనిపై నిర్వహించిన వివిధ సర్వేల్లో 50శాతానికిపైగా ప్రజలు అట్టహాస పట్టాభిషేకంపై పెదవి విరిచారు. ఇదంతా ప్రజాధనాన్ని వృథా చేయడమేనని అభిప్రాయపడుతున్నారు.
ఆనాడు సామ్రాజ్యం... నేడు?
1953లో ఎలిజబెత్-2 పట్టాభిషేకం జరిగిన సమయానికి బ్రిటన్ రాజకీయంగా బలమైన దేశం. ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుండేది. ఐరోపాలోనైతే బ్రిటన్దే పెద్దన్న పాత్ర. వలస రాజ్యాలు పోయినా కామన్వెల్త్ పేరిట బ్రిటన్ రాజరికానికి గౌరవం ఉండేది. అన్నింటికి మించి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ను, మతాన్ని మెజారిటీ ప్రజలు అనుసరించేవారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. అలనాటి రాజకీయ పెత్తనంగానీ, కామన్వెల్త్ గౌరవంగానీ ఇప్పుడు లేవు. బ్రెగ్జిట్ తర్వాత ఐరోపాలోనూ బ్రిటన్ ఏకాకిగా ఇబ్బంది పడుతోంది. పైగా ఆర్థిక సంక్షోభాలతో ఒకనాటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అతలాకుతలం అవుతోంది. చాలామంది ఆర్థికవేత్తల దృష్టిలో బ్రిటన్ ఇప్పుడో పేద దేశం. అంతేగాకుండా... దేశంలో సుమారు 46శాతం మందే చర్చిని, మతాన్ని అనుసరిస్తున్నట్లు 2021 జనగణన లెక్కలు తేల్చాయి. అంటే... బ్రిటన్లో మెజారిటీ ప్రజలు మతానికి, చర్చికి దూరమయ్యారు. వీటన్నింటికి తోడు తాజా ఆర్థిక పరిస్థితులతో దేశంలో జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. సామాన్యుల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ఆహార లభ్యత కష్టమైపోతోంది. ఆహార బ్యాంకులపై ఆధారపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే అధికారికంగా రాజుగా బాధ్యతలు చేపట్టిన ఛార్లెస్ పట్టాభిషేకం కోసం 10 కోట్ల పౌండ్లను (రూ. 1,020 కోట్లు) ఖర్చు చేయడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.
* అసలు పట్టాభిషేకం ఎందుకనే ప్రశ్న చాలామందిలో ఉత్పన్నమవుతోంది. కారణం ఐరోపాలోని అనేక దేశాల్లో రాజరికాలున్నా ఇలా కిరీట ధారణ, పట్టాభిషేకం కార్యక్రమాలు లేవు. బెల్జియం, డెన్మార్క్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్.. ఇలా అన్నింటా రాజరికాలున్నాయి. కానీ ఎక్కడా ఇలా పట్టాభిషేకం లేదు. అధికారిక ప్రకటనతోనే రాజు/రాణి పదవి చేపడతారు. అయితే... బ్రిటన్కు గౌరవప్రదమైన సంప్రదాయాన్ని అంతే గౌరవంగా నిర్వహించాలని వాదించేవారూ లేకపోలేదు. ‘ఈ తరంలో ఇప్పటివరకూ చూడని అరుదైన వేడుక ఇది. బ్రిటిష్ ప్రజలందరికీ ఇది గర్వకారణం. వీటిపై ఖర్చు చేసేదేమీ కాదు. పట్టాభిషేకానికి ప్రభుత్వమే ఖర్చు చేయడమనేది సంప్రదాయం. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత హంగామా లేకుండా చేస్తాం’ అని బ్రిటన్ ఉప ప్రధాని ఒలివర్ డౌడెన్ వ్యాఖ్యానించారు.
రాజుగారి బండ సింహాసనం!
ఛార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవానికి.. దేశ విదేశాల ప్రముఖులు, అతిథులతో పాటు ఓ బండకూ ప్రత్యేక స్థానం లభించబోతోంది. బ్రిటన్ చక్రవర్తి, రాణి పట్టాభిషేకంలో సంప్రదాయాలదే పెద్దపీట. ఇందులో వాడే వస్తువులు, పాటించే పద్ధతులు అన్నింటికీ పెద్ద చరిత్రే ఉంటుంది. అలాంటిదే ఈసారి పట్టాభిషేకంలో కనిపించబోతున్న ఓ స్కాట్లాండ్ బండ. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ బండను ఇటీవలే స్కాట్లాండ్లోని ఎడిన్బరో రాజభవనం నుంచి లండన్కు అత్యంత గౌరవ మర్యాదలతో, రాజ లాంఛనాలతో తీసుకొచ్చారు. 150 కిలోల బరువుండే ఈ ఎర్ర రంగు బల్లపరుపు బండను స్కోన్ బండ (స్కాట్లాండ్లోని పట్టణం పేరు స్కోన్)గా పిలుస్తారు. దీన్ని ఎంతో పవిత్రమైనదిగా, రాజరికపు, జాతీయ ప్రతీకగా, ‘విధి పీఠం’ (స్టోన్ ఆఫ్ డెస్టినీ) భావిస్తుంటారు. తొమ్మిదో శతాబ్ది ఆరంభంలో స్కాటిష్ రాజులు దీనిపై కూర్చుని పట్టాభిషేకం చేసుకునేవారు. కిరీటాలేమీ ఉండేవి కావు. ఈ రాతి సింహాసనంపై కూర్చోవడాన్నే రాజ్యానికి బలమైన పునాదిగా భావించేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM