King Charles III: పట్టాభిషేకానికి వేళాయె.. బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి కిరీటధారణ నేడు
బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది. శనివారం లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబికులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక సందడిగా జరగనుంది.
బైబిల్ను పఠించనున్న ప్రధాని రిషి సునాక్
అతిథులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో సందడిగా వేడుక
లండన్: బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది. శనివారం లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబికులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక సందడిగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఛార్లెస్తోపాటు ఆయన భార్య రాణి కెమిల్లాకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేస్తారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు లండన్కు చేరుకుంటున్నారు. భారతదేశం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ధన్ఖడ్ శుక్రవారం లండన్కు చేరుకోగా, వారికి ఘన స్వాగతం లభించింది. సుమారు 100 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
భిన్న మత విశ్వాసాలకు పట్టం
ఛార్లెస్-3 పట్టాభిషేకం సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్లోని ఎంపిక చేసిన పంక్తులను పఠిస్తారు. ఇతరులకు సేవ, సకల జనులపై క్రీస్తు ప్రేమను తెలియజేసేలా అది ఉండబోతోంది. బ్రిటన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానులు బైబిల్ను పఠించడం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు సునాక్ కూడా దాన్ని పాటించనున్నారు. ఈసారి పట్టాభిషేక వేడుకలో భిన్న మత విశ్వాసాలకు పెద్దపీట వేస్తున్నట్లు కాంటెర్బరీ ఆర్చ్బిషప్ కార్యాలయం తెలిపింది. భారతీయ మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధాని, హిందూ మతస్థుడు అయిన సునాక్ క్రైస్తవ మత గ్రంథాన్ని పఠించనుండటం అందుకు అద్దం పడుతుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్