Donald Trump: ట్రంప్ నోట.. అదే తిట్లపురాణం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నట్లు పదే పదే అబద్ధాలు వల్లె వేస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమవుతున్న ట్రంప్ బుధవారం రాత్రి సీఎన్ఎన్ టెలివిజన్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో నోటిదురుసు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నట్లు పదే పదే అబద్ధాలు వల్లె వేస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమవుతున్న ట్రంప్ బుధవారం రాత్రి సీఎన్ఎన్ టెలివిజన్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ట్రంప్ ఈ సందర్భంగా మళ్లీ ఆరోపించారు. న్యాయస్థానాలు రిగ్గింగుకు ఆధారాలు లేవని తేల్చినా ట్రంప్ పాత పాటే పాడుతున్నారు. 2020లో అధ్యక్షునిగా జో బైడెన్ ఎన్నికను సవాలు చేస్తూ ట్రంప్ మద్దతుదారులు పార్లమెంటు (కాంగ్రెస్)పై దండెత్తారు. బైడెన్ ఎన్నికను ధ్రువీకరిస్తూ నాటి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చేస్తున్న ప్రకటనను అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఎన్నిక ఫలితాన్ని నిలిపివేసే అధికారం పెన్స్కు లేకపోయినా ఉందంటూ ట్రంప్ బుకాయించారు. పెన్స్ తప్పు చేశారని ఇంటర్వ్యూలో మళ్లీ ఉద్ఘాటించారు. ఆ రోజు కాంగ్రెస్పై దండెత్తిన 670 మంది ట్రంప్ అనుయాయులపై విద్రోహ కుట్ర, పోలీసు అధికారులపై దాడి అనే అభియోగాలను మోపారు. నాటి కాల్పుల్లో నల్లజాతికి చెందిన ఓ పోలీసు అధికారి మరణించారు. ఆ అధికారి దౌర్జన్యపరుడని ట్రంప్ అన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలు నిజాయితీగా జరిగితేనే ఫలితాన్ని ఆమోదిస్తానన్నారు. జీన్ కెరోల్ అనే పాత్రికేయురాలిపై ట్రంప్ లైంగికదాడికి పాల్పడినట్లు నిర్ధారించిన న్యూయార్క్ కోర్టు జ్యూరీ కెరోల్కు ట్రంప్ 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని మంగళవారం తీర్పు చెప్పింది. సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ట్రంప్ దీన్ని బోగస్ కేసుగా వర్ణించారు. కెరోల్ పిచ్చిపట్టిన మనిషి అని దుయ్యబట్టారు. రష్యాపై ఉక్రెయిన్ గెలవాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. గెలుపోటముల కోణంలో తాను ఆలోచించనని బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్