Pakistan - Imran Khan: నివురుగప్పిన నిప్పులా పాక్
పాకిస్థాన్లో సోమవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న నేపథ్యంలో దేశంలో మరోసారి హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నేడు దేశంలో పలు కీలక పరిణామాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సోమవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న నేపథ్యంలో దేశంలో మరోసారి హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షం నిరసనలు నిర్వహించతలపెట్టడం, పంజాబ్ రాష్ట్రంలో మే 14న ఎన్నికలు నిర్వహించాలన్న తన ఉత్తర్వునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుండటం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక హైకోర్టులో హాజరుకానుండటం వంటి పరిణామాలు ఒకేరోజు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అవినీతి కేసులో అరెస్టయిన ఇమ్రాన్ ఖాన్ పట్ల పాక్ సుప్రీంకోర్టు పక్షపాతాన్ని ప్రదర్శించి, ఆయనను విడుదల చేయించిందని మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం), మరో డజను పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు వెలుపల నిరసన ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించాయి.
పీడీఎం.. పాక్ ప్రభుత్వంలో కీలక భాగస్వామి. అయితే ఇస్లామాబాద్లో రాజకీయ కార్యక్రమాలపై ఇప్పటికే నిషేధం విధించారు. సైన్యాన్ని కూడా మోహరించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే నిరసనలు హింసకు దారితీసే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో మే 14న ఎన్నికలు నిర్వహించాలంటూ గత నెల 4న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తిసభ్య ధర్మాసనం సోమవారం విచారించనుంది. ఎన్నికల నిర్వహణకు కోర్టు పెట్టిన గడువు ఇప్పటికే ముగిసింది. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే పేర్కొన్నారు. దీంతో ప్రధాన మంత్రి, అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలకు న్యాయస్థానం పూనుకునే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. వివిధ కేసుల్లో బెయిలు కోసం ఇమ్రాన్ ఖాన్ సోమవారం లాహోర్ హైకోర్టుకు హాజరవుతారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో ఆయన హస్తం ఉందని తేలితే ఆయనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని సనావుల్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఉత్కంఠ నెలకొంది.
సైన్యానికి సిగ్గుండాలి: ఇమ్రాన్ఖాన్
పాకిస్థాన్ సైన్యంపై ఇమ్రాన్ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ఆర్మీకి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. రాజకీయాలే చేయాలనుకుంటే సొంతంగా పార్టీ పెట్టుకోవాలని హితవు పలికారు. ఇస్లామాబాద్ న్యాయస్థానం పలు కేసుల్లో బెయిలిచ్చిన అనంతరం తొలిసారి ఇమ్రాన్ లాహోర్లోని తన నివాసం నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా సైన్యానికి అనుబంధ సంస్థైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) తనను కపటి.. నయవంచకుడు అంటూ దూషించడంపై తీవ్రంగా స్పందించారు. తాను ప్రపంచంలో పాకిస్థాన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయానికి ఐఎస్పీఆర్ పుట్టనే లేదని అన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా నేను పాక్ జెండాను గర్వంగా ఎగరేశాను. మీరేమో రాజకీయాలు చేస్తున్నారు. ఇందుకు సిగ్గుపడాలి. మీరు కూడా ఓ రాజకీయ పార్టీ పెట్టుకోండి’’ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పాక్ సైన్యాధిపతి జనరల్ అసీమ్ మునీర్పైనా ఆరోపణలు చేశారు. తనకు కోర్టు బెయిలిచ్చినా.. మునీర్ కిడ్నాప్నకు పాల్పడ్డారని అన్నారు. ఎన్నికలొస్తే తుడిచిపెట్టుకుపోతామని ప్రభుత్వాన్నేలుతున్న పార్టీలకు తెలుసునని.. అందుకే దేశంలో అలజడులు సృష్టించడానికి అవి కుట్ర పన్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..