UNO: ప్రపంచం ముంగిట ప్రచండ జ్వాలలు.. ఐరాస హెచ్చరిక
వచ్చే అయిదేళ్లలో ప్రపంచం తాపమానం పెరుగుదల పరిమితిని తాత్కాలికంగా అధిగమించే అవకాశం మూడింట రెండు వంతులు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం బుధవారం హెచ్చరించింది.
వాషింగ్టన్: వచ్చే అయిదేళ్లలో ప్రపంచం తాపమానం పెరుగుదల పరిమితిని తాత్కాలికంగా అధిగమించే అవకాశం మూడింట రెండు వంతులు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం బుధవారం హెచ్చరించింది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ (2.7 డిగ్రీల ఫారెన్హీట్) వద్ద నిలువరించకపోతే ప్రపంచమంతటా పర్యావరణ విధ్వంసం పెచ్చరిల్లుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద కట్టడి చేయాలని 2015లో పారిస్ వాతావరణ ఒప్పందం చేసుకున్నారు. కానీ, ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను ఆశించిన స్థాయిలో అరికట్టలేకపోతున్నందున 2030 తర్వాత భూఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు చేరుకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వచ్చారు. అయితే, అంతకంటే ముందే ప్రమాదం ముంచుకు వస్తోందని.. ఎల్నినో, లానినా సయ్యాట వల్ల ఇప్పటినుంచి 2027 లోపు 1.5 డిగ్రీలకు మించి భూతాపం పెరిగే అవకాశముందని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ తాజా నివేదిక బుధవారం హెచ్చరించింది. వాతావరణ రికార్డులను నమోదు చేయడం ఆరంభించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాగల అయిదేళ్లూ భూమికి అత్యుష్ణ సంవత్సరాలుగా నిలిచిపోయే అవకాశం 98 శాతం ఉన్నట్లు దీని సారాంశం. ఎల్నినో వల్ల పెరగనున్న వేడి శాశ్వతం కాదనీ, 2030 లోపు తరచుగా ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలను దాటవచ్చని శాస్త్రజ్ఞులు వివరించారు.
* చల్లదనాన్ని తీసుకొచ్చే లానినా మూడేళ్లపాటు కొనసాగడం వల్ల మానవ కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే వేడికి కొంతవరకు పగ్గాలు పడ్డాయి. ఈ ఏడాది నుంచి లానినా పక్కకు తొలగి.. అత్యుష్ణ జనక ఎల్నినో ముందుకొస్తోంది. 2016లో ఎల్నినో రికార్డు ఉష్ణోగ్రతకు కారణమైంది. ఆ రికార్డు ఇప్పటి నుంచి 2027 లోపు బద్దలయ్యే ప్రమాదం ఉంది. లానినా స్థానంలో ఎల్నినో ప్రవేశించడం వల్ల గత మూడేళ్లలో వరదలు వచ్చినచోట అనావృష్టి, అనావృష్టి ఎదురైనచోట వరదలు వస్తాయని బ్రిటిష్ వాతావరణ పరిశోధకుడు లియో హెర్మన్సన్ హెచ్చరించారు. వాతావరణ శాస్త్రజ్ఞులు 30 ఏళ్ల సగటును తీసుకుంటారు కాబట్టి, ఏదో ఒక సంవత్సరం ఉష్ణోగ్రత పెరగడాన్ని చూసి అతిగా కంగారు పడనక్కర్లేదన్నారు. రాబోయే అయిదేళ్లలో అమెజాన్ అడవుల్లో వర్షాభావం ఏర్పడితే, ఆఫ్రికాలో సహారా ఎడారి దిగువనున్న సాహెల్ ప్రాంతంలో అతివృష్టి ఏర్పడుతుంది. కాబట్టి, చెడులోనూ మంచి ఉందని హెర్మన్సన్ అన్నారు. మరోవైపు.. మానవ కార్యకలాపాల వల్ల సముద్రాలు వేడెక్కిపోతున్నాయని అమెరికన్ వాతావరణ శాస్త్రజ్ఞుడు మైకేల్ మాన్ హెచ్చరించారు. ఇప్పుడప్పుడే భూ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల లక్ష్మణరేఖను దాటే ప్రమాదం లేదని, మానవాళి కలిసికట్టుగా కృషి చేస్తే భూతాపాన్ని నిరోధించవచ్చని మాన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.