1,100 ఏళ్లనాటి బైబిల్‌కు రూ.314 కోట్లు

కోడెక్స్‌ సాసూన్‌.. అనే హీబ్రూ బైబిల్‌ ప్రపంచంలోనే అతి పురాతనమైన బైబిల్‌లలో ఒకటి. 1,100 ఏళ్లనాటి ఈ బైబిల్‌ను న్యూయార్క్‌లో అమ్మకానికి పెడితే రూ.314 కోట్ల ధర పలికింది.

Published : 19 May 2023 05:46 IST

న్యూయార్క్‌: కోడెక్స్‌ సాసూన్‌.. అనే హీబ్రూ బైబిల్‌ ప్రపంచంలోనే అతి పురాతనమైన బైబిల్‌లలో ఒకటి. 1,100 ఏళ్లనాటి ఈ బైబిల్‌ను న్యూయార్క్‌లో అమ్మకానికి పెడితే రూ.314 కోట్ల ధర పలికింది. చేతితో రాసిన ఈ బైబిల్‌ వేలంలో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. రొమేనియాలో అమెరికా మాజీ రాయబారి ఆల్ఫ్రెడ్‌ బి.మోసెస్‌ దీన్ని కొనుగోలు చేశారు. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌లో ఉన్న మ్యూజియం ఆఫ్‌ జ్యూయిష్‌ పీపుల్‌కు ఈ బైబిల్‌ను విరాళంగా ఇచ్చారు. క్రీస్తు శకం 880 నుంచి 960 మధ్యకాలంలో దీన్ని రాసి ఉంటారని చరిత్రకారులు అంటున్నారు. రాతపత్రుల్లో 2021లో అమెరికా రాజ్యాంగం దాదాపు రూ.400 కోట్లకు పైగా ధర పలికింది. లియోనార్డో డావిన్సీ రాసిన కోడెక్స్‌ లీసెస్టర్‌ 1994లో జరిగిన వేలంలో అప్పట్లోనే రూ.300 కోట్లకు పైగా అమ్ముడుపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని