యుద్ధ పరిష్కారానికి కృషి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమస్యలో కాకుండా... దాని పరిష్కారంలో భాగమవుతామని భారత్ స్పష్టం చేసింది. ఎవరో ఒకరి పక్షం వహించబోమని పరోక్షంగా తేల్చిచెప్పింది.
మీ సమరం మామూలుది కాదు
మానవత్వం, విలువలకు సవాలిది
ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ
శాంతియత్నానికి మద్దతు కోరిన జెలెన్స్కీ
హిరోషిమా: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమస్యలో కాకుండా... దాని పరిష్కారంలో భాగమవుతామని భారత్ స్పష్టం చేసింది. ఎవరో ఒకరి పక్షం వహించబోమని పరోక్షంగా తేల్చిచెప్పింది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి ముఖాముఖి భేటీ అయ్యారు. హిరోషిమాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సు ఇందుకు వేదికైంది. ప్రత్యేక ఆహ్వానితుడిగా మోదీ ఈ సదస్సుకు రాగా... యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా... తమకు మద్దతివ్వాల్సిందిగా ఆయా దేశాలను కోరడానికి జెలెన్స్కీ వచ్చారు. ఈ సందర్భంగా వీరిద్దరి భేటీ జరిగింది. యుద్ధ పరిష్కారానికి సాధ్యమైనంతగా భారత్ కృషి చేస్తుందని, ఆ దిశగా ఉక్రెయిన్కు అండగా ఉంటుందని జెలెన్స్కీకి మోదీ భరోసా ఇచ్చారు. ‘‘గత ఏడాదిన్నర కాలంలో అనేక సార్లు మనం ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎట్టకేలకు ప్రత్యక్షంగా ఒకరినొకరం కలుసుకునే అవకాశం ఇప్పటికి చిక్కింది. యుద్ధ బాధ మా అందరికంటే మీకే ఎక్కువ తెలుసు. ఉక్రెయిన్లో జరుగుతున్నది మామూలు యుద్ధం కాదు. ప్రపంచంపై అనేక కోణాల్లో ప్రభావం చూపుతోంది. భారత్ తరఫునే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఈ సంఘర్షణకు పరిష్కారం కనుక్కోవడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామని మీకు మాటిస్తున్నా. నా దృష్టిలో ఇది రాజకీయ, ఆర్థిక ఘర్షణ కాదు. మానవత్వం, విలువలకు సవాలు ఈ యుద్ధం’’ అని జెలెన్స్కీతో మోదీ అన్నారు.
భారత్కు జెలెన్స్కీ కృతజ్ఞతలు
రష్యాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు కూడగట్టడానికి వచ్చిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి అండగా నిలుస్తున్నందుకు, మానవతా దృక్పథంతో సాయం చేస్తున్నందుకు భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయానికి మోదీ పిలుపు
పర్యావరణ మార్పులు, నీటి ఎద్దడి, పౌష్టికాహార లోపం, ఆహార అభద్రత వంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపే తృణ ధాన్యాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని మోదీ జీ7 దేశాలకు సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రత్యామ్నాయ విధానంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. జీ7 దేశాల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా పేదలందరికీ ఆహార భద్రతను కల్పించడానికి సమీకృత విధానాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల అధిక దిగుబడికి ఉపయోగపడే ఎరువులపై గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవాలన్న మనస్తత్వం తగదని పేర్కొన్నారు. అయితే, ఏ దేశం పేరునూ మోదీ నేరుగా ప్రస్తావించలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తే అది ప్రజాస్వామ్యం, అభివృద్ధికి మధ్య వారధిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. చిన్న, సన్నకారు రైతులకు చేయూతనివ్వడం అన్ని దేశాల ప్రాధాన్యంగా మారాలని సూచించారు. ఆహార పదార్థాల వృథాను అరికట్టాలని నొక్కి చెప్పారు. సుస్థిర ఆహార భద్రత అన్ని దేశాల సమష్టి బాధ్యత కావాలని సూచించారు.
హిరోషిమాలో మహాత్ముడి విగ్రహావిష్కరణ
హరిత హైడ్రోజన్, సెమీకండక్టర్, విద్య, నైపుణ్యం, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. జపాన్ ప్రధాని కిషిదతో మోదీ దాదాపు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. జపాన్లో భారతీయ సంస్కృతిని చాటిచెబుతున్న జపనీస్ ప్రముఖులను ప్రధాని మోదీ కలుసుకున్నారు. హిరోషిమాలో అణుబాంబు స్మారక స్తూపానికి సమీపంలోనే శాంతిదూత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్