Pakistan: పాకిస్థాన్ తాలిబన్ల హిట్లిస్టులో ప్రముఖులు
పాక్ ప్రభుత్వం నిషేధం విధించిన పాకిస్థాన్ తాలిబన్ మిలిటెంట్ల గ్రూపు తాజా హిట్లిస్టులో పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు ఉన్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇస్లామాబాద్: పాక్ ప్రభుత్వం నిషేధం విధించిన పాకిస్థాన్ తాలిబన్ మిలిటెంట్ల గ్రూపు తాజా హిట్లిస్టులో పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు ఉన్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఈ ఉగ్రమూకతోపాటు దీని అనుబంధ జమాతుల్ అహ్రార్ (జేయూఏ) ఈ జాబితాను సిద్ధం చేసినట్లు కథనాల సారాంశం. అందులో పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా, పాకిస్థాన్ ముస్లింలీగ్ (నవాజ్) పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్లతోపాటు పలువురు మిలటరీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు, సీనియర్ ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్సులోని మారుమూల ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి నుంచి మితవాద మత రాజకీయ పార్టీ జమాత్ ఇ ఇస్లామి చీఫ్ సిరాజుల్ హఖ్ తప్పించుకున్నారు. ఈ ఘటన తర్వాత హిట్లిస్టు వివరాలు బయటకు రావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.