ఐరాసను సంస్కరించాల్సిందే!
ప్రస్తుత ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించకుంటే ఐక్యరాజ్య సమితి(ఐరాస), భద్రతా మండలి కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
శాంతి పరిరక్షణలో ఆ సంస్థ వైఫల్యాలపై నిలదీసిన భారత ప్రధాని మోదీ
భద్రతా మండలి విస్తరణకు డిమాండ్
జీ-7 వేదికపై ప్రసంగం
హిరోషిమా: ప్రస్తుత ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించకుంటే ఐక్యరాజ్య సమితి(ఐరాస), భద్రతా మండలి కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ సంస్థల్లో భారీ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. జపాన్లోని హిరోషిమాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగిస్తూ.. ప్రపంచ శాంతి, సుస్థిరతలకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడం కోసం ఐరాస ఏర్పడినప్పటికీ వివిధ వేదికలపై ఆయా అంశాలను ఎందుకు చర్చించాల్సి వస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇది విశ్లేషణకు సంబంధించిన అంశం. ఐరాస ఉన్నది ఎందుకు? ప్రపంచ శాంతి స్థాపన లక్ష్యంతో ఏర్పడిన ఈ వేదిక.. ఘర్షణలను ఎందుకు విజయవంతంగా నిరోధించలేకపోతోంది? కనీసం ఉగ్రవాదం అనే పదానికి నిర్వచనాన్ని కూడా ఆమోదించలేకపోతోంది ఎందుకు? ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకుంటే... గత శతాబ్దంలో ఆవిర్భవించిన ఈ సంస్థలు 21వ శతాబ్ద పరిస్థితులకు అనుగుణంగా లేవని స్పష్టమవుతోంది. ప్రస్తుత వాస్తవికతకు అవి అద్దంపట్టడం లేదు. అందుకే ఐరాస సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దక్షిణార్ధ గోళ దేశాల గళం కూడా ఆ సంస్థల్లో వినపడాలి. లేదంటే, ఘర్షణలకు ముగింపు పలకాలని మాత్రమే మాట్లాడుకోగలం. దీంతో ఐరాస, భద్రతా మండలి కేవలం చర్చా వేదికలుగానే మిగిలిపోతాయి’ అని భారత ప్రధాని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గౌరవించాలి
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై జీ7 సదస్సులో మోదీ మాట్లాడుతూ... ఆ రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అంశాన్ని రాజకీయ, ఆర్థిక కోణంలో కాకుండా మానవత, మానవీయ కోణంలో చూడాలన్నారు. అన్ని దేశాలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఐరాస నిబంధనలను గౌరవించాలన్నారు. పొరుగు దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గుర్తించాలని సూచించారు.
పపువా న్యూ గినియా ప్రధాని పాదాభివందనం
విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం లభించింది. గినియా దేశ ప్రధాని జేమ్స్ మరాపే.. మోదీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాజాగా ఈ వీడియో వైరల్గా మారింది. అక్కడి ప్రవాస భారతీయులు కూడా విమానాశ్రయం వద్ద మోదీతో కరచాలనం చేశారు. ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. పపువా న్యూ గినియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా