చైనా బుట్టలో పడనీకుండా.. భారత్, అమెరికా దౌత్య వ్యూహాలు
పపువా న్యూ గినియా... ప్రపంచ పటంలో ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియని దేశం. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం వెళదామని తయారయ్యారు.
పపువా న్యూ గినియా... ప్రపంచ పటంలో ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియని దేశం. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం వెళదామని తయారయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తమ దేశానికి రావాలంటూ గినియా అధ్యక్షుడికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు. ఉన్నట్టుండి ఎందుకు అగ్రరాజ్యాలన్నీ... ఈ ఊరూ పేరు తెలియని పపువా న్యూ గినియా వెంటపడుతున్నాయంటే...!
పసిఫిక్ సముద్రంలో ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉండే ఓ దీవి ఈ పపువా న్యూ గినియా. ప్రపంచంలో మూడో అతిపెద్ద ద్వీప దేశమిది. 1793 నుంచీ అనేక దేశాల వలసరాజ్యంగా నలిగి 1975లో స్వాతంత్య్రం పొందింది. ఇంగ్లాండ్ రాజే తమ రాజుగా... బ్రిటన్ కామన్వెల్త్లో కొనసాగుతోంది. జీవ వైవిధ్యానికి పెట్టింది పేరుగా ఖ్యాతిగాంచింది. అత్యధిక అడవులతో, 700కుపైగా పక్షిజాతులతో, 45వేల కిలోమీటర్ల పొడవైన పగడపు దిబ్బలతో, వందల అగ్నిపర్వతాలతో అలరారుతున్న ఈ దీవిలో వందలాది ఆదివాసీ తెగలు ఒంటరిగా జీవిస్తున్నాయి. దాదాపు 852 భాషలు మాట్లాడతారిక్కడ. ప్రతి తెగకూ ప్రత్యేక భాష, సంప్రదాయాలు, అలవాట్లతో భాషా, సాంస్కృతికపరంగానూ ఇదెంతో వైవిధ్యమైంది. వందల సంవత్సరాల వలస పాలనను కూడా తట్టుకొని వీరంతా తమ భాషలను, సంప్రదాయాలను కాపాడుకుంటుండటం విశేషం.
మంచినీరు, విద్యుత్లాంటి సౌకర్యాలు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయింకా. వ్యవసాయం ప్రధాన ఆర్థిక వనరు. అయితే 1970ల్లో పెట్రోలియం, గ్యాస్, రాగి, బంగారం నిక్షేపాలు బయటపడటంతో... పపువా న్యూ గినియా ఆర్థికాభివృద్ధిలో అవి కీలకంగా మారాయి. 1975 నుంచే భారత్ ఈ దేశంతో దౌత్యసంబంధాలను కొనసాగిస్తోంది. దాదాపు 3వేల మంది భారతీయులు ఇక్కడ పని చేస్తున్నారు. సీఏలు, ప్రొఫెసర్లు, టీచర్లు, డాక్టర్లు, ఐటీ, ఆర్థిక నిపుణులతో పాటు చమురు ఉత్పత్తి రంగంలో అనేక మంది ఉన్నారు.
ఎందుకీ ప్రాధాన్యం?
అమెరికాతో పోటీగా ప్రపంచంలో అన్నింటా తన ముద్ర వేయాలని చూస్తున్న చైనా పసిఫిక్ మహాసముద్రంలోని ఈ దీవులపైనా కన్నేసింది. పపువా న్యూ గినియాతో పాటు అనేక చిన్నచిన్న దీవి దేశాలను బుట్టలో వేసుకోవాలని చూస్తోంది. ఆయా దేశాల్లో పెట్టుబడులు, ఆర్థిక సహకారం రూపంలో ఆకర్షిస్తోంది. తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా... సొలొమన్ దీవులతో ఒప్పందం కుదుర్చుకొని పోర్టును ఆధునికీకరించే పనులు మొదలెట్టింది. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ఈ దీవులు పసిఫిక్లో కీలకమైనవి. అందుకే... ఈ దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. దీనిలో భాగంగానే పపువా న్యూ గినియా ప్రధానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవలే ప్రత్యేక ఆహ్వానం పంపించారు. చైనాకు పోటీగా క్వాడ్ కూటమిగా ఏర్పడ్డ అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు దీంతో ఉలిక్కిపడ్డాయి. ఫలితమే పపువా న్యూ గినియాతో పాటు పలు పసిఫిక్ దీవి దేశాలను బుజ్జగించటం. జపాన్లో జీ-7 సదస్సు కాగానే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా గినియాలో పర్యటించాల్సింది. కానీ స్వదేశంలో అప్పుల సంక్షోభం నేపథ్యంలో ఆయన అత్యవసరంగా వెళ్లాల్సి రావటంతో తన విదేశాంగ మంత్రి బ్లింకన్ను పంపించారు. గినియాతో ఒప్పందం చేసుకోవటానికి బ్లింకన్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. తద్వారా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ దీవులు చైనా బుట్టలో పడకుండా భారత్, అమెరికా... ఇతర క్వాడ్దేశాలు జాగ్రత్తపడుతున్నాయి. ఫలితమే ఈ పర్యటనలన్నీ! అలా పైకి కనిపించని దౌత్య ఎత్తుగడలతో పసిఫిక్ దీవులకు ప్రాధాన్యం పెరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!