టీ20 తీరున ద్వైపాక్షిక సంబంధాలు
అరుదైన ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్-ఆస్ట్రేలియాలు ముందడుగు వేశాయి.
భారత్-ఆస్ట్రేలియా స్నేహంపై నరేంద్ర మోదీ వ్యాఖ్య
బెంగళూరులో ఆస్ట్రేలియా కాన్సులేట్.. త్వరలోనే ప్రారంభిస్తామన్న ఆల్బనీస్
ముగిసిన ప్రధానమంత్రి 3 దేశాల పర్యటన
సిడ్నీ/దిల్లీ: అరుదైన ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్-ఆస్ట్రేలియాలు ముందడుగు వేశాయి. రెండు దేశాల మధ్య విద్యార్థులు, పరిశోధకుల రాకపోకలు, వలసలకు సంబంధించి కీలక ఒప్పందాలు అక్షరరూపం దాల్చాయి. సిడ్నీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో ప్రధాని మోదీ బుధవారం వివిధ అవగాహనా ఒప్పందాలపై చర్చలు జరిపారు. ఈ ఏడాది చివరికి సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని సాకారం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. పునరుత్పాదక రంగంలో భారీ అవకాశాలను సృష్టించే గ్రీన్ హైడ్రోజన్ కార్యదళంపై విధివిధానాల రూపకల్పనకు గాను ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ, ఆల్బనీస్లు మీడియాతో మాట్లాడారు. ‘‘పరస్పర విశ్వాసం, గౌరవంతో పాటు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు రెండు దేశాల మధ్య సజీవ వారధులుగా నిలుస్తున్నార’’ని ప్రధాని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ‘టీ20 మోడ్లోకి ప్రవేశించాయ’ంటూ క్రికెట్ పరిభాషలో వివరించారు. ఏడాది వ్యవధిలో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో ఆరుసార్లు భేటీ కావడాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ‘గత ఏడాది భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంపై దృష్టి సారించాం. ఇది రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సహకారంలో నూతన అవకాశాలకు బాటలు వేస్తుంద’ని పేర్కొన్నారు.
ఆల్బనీస్కు మోదీ ఆహ్వానం..
ఈ ఏడాది భారత్లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను వీక్షించేందుకు రావాల్సిందిగా ఆల్బనీస్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను మోదీ ఆహ్వానించారు. అదే సమయంలో వైభవంగా జరిగే దీపావళి వేడుకలను చూడొచ్చని చెప్పారు. బెంగళూరులో త్వరలో తమ దేశ కాన్సులేట్ను ప్రారంభించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ వెల్లడించారు. సిడ్నీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లే, విపక్ష లిబరల్ పార్టీ నేత పీటర్ డ్యూటన్, ఇతర ప్రముఖులతోనూ విడివిడిగా భేటీ అయ్యారు.
వేర్పాటువాదులపై చర్యలకు ఆస్ట్రేలియా ప్రధాని హామీ
‘ఆస్టేలియాలో ఆలయాలు, ప్రార్థనా స్థలాలపై జరుగుతోన్న దాడులు, వేర్పాటువాద(ఖలిస్థాన్)శక్తుల కార్యకలాపాల గురించి ఆల్బనీస్, నేను గతంలో చర్చించాం. ఇప్పుడు కూడా ఆ అంశం మా మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు హానికలిగించే చర్యలను మేం ఏ మాత్రం అంగీకరించం. అలాంటి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్బనీస్ మరోసారి హామీ ఇచ్చారు’ అని మోదీ వెల్లడించారు.
త్రివర్ణాల్లో మెరిసిన ఒపెరా హౌస్
ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకుని సిడ్నీలోని ప్రసిద్ధ ఒపెరాహౌస్, హార్బర్ బ్రిడ్జ్లను భారత జాతీయ పతాకంలోని మూడు వర్ణాలతో మెరిసేలా అలంకరించారు. ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైందని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆతిథ్యమిచ్చిన ఆ దేశ ప్రజలు, ప్రధాని ఆల్బనీస్కు కృతజ్ఞతలు తెలిపారు. దిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారంతో ప్రధాని మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటన ముగిసింది. జీ7, క్వాడ్ సదస్సుల్లో పాల్గొనేందుకు శుక్రవారం జపాన్ వెళ్లిన ఆయన ఆ తర్వాత పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాల్లో పర్యటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
అక్టోబరు 7నాటి హమాస్ దాడుల విషయంలో నిఘా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహరోన్ హలీవా రాజీనామా చేశారు. -
చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్తో దౌత్యం జరిపేనా!
చైనా అనుకూలుడిగా పేరున్న మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించింది. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) భారీ విజయాన్ని నమోదు చేసింది. -
దాడి భారీగానే చేశాం కానీ.. ఇజ్రాయెల్కు జరిగింది స్వల్ప నష్టమే
ఇజ్రాయెల్పై ఇరాన్ భారీస్థాయిలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్కు మాత్రం స్వల్ప నష్టమే జరిగింది. ప్రయోగించిన 300కి పైగా డ్రోన్లు, బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు పెద్దగా ప్రభావం చూపలేదు. -
కడుపుకోతల యుద్ధం
యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. -
అమెరికాలో కాల్పులు.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు
అమెరికాలోని మెంఫిస్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక పార్కులో జరుగుతున్న ఓ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో ఇద్దరు మరణించారు. -
మాకు పురుగుల బియ్యం పంపుతున్నారు
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో న్యాణత లోపించిందని రష్యా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. -
అసాధారణ వాతావరణ పోకడలు ఇక సర్వసాధారణం!
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో తీవ్రస్థాయి వేడి వాతావరణం నెలకొంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. వేడెక్కుతున్న భూగోళానికి ఇది నిదర్శనమని తెలిపింది. -
సముద్రంలో కుప్పకూలిన రెండు హెలికాప్టర్లు
జపాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రివేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన రెండు నౌకాదళ హెలికాప్టర్లు సముద్రంలో కుప్పకూలిపోయాయి. -
యుద్ధం ‘తల్లి’ ప్రాణం తీస్తే.. వైద్యులు ‘గర్భస్థ శిశువు’కు ఊపిరిపోశారు!
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 మంది చిన్నారులను ప్రాణాలు కోల్పోయారు. -
పురుగుల బియ్యం.. పాకిస్థాన్కు రష్యా వార్నింగ్!
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో పురుగులు రావడంపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో దిగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు
-
టీవీ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా