సంపన్న దేశాల్లోనే ‘ఆధునిక బానిసత్వం’ ఎక్కువ!
ప్రపంచంలో ఆధునిక బానిసత్వాన మగ్గుతున్న 5 కోట్ల మందిలో సగానికి పైగా 20 సంపన్న దేశాల్లోనే ఉన్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
భారత్, చైనాల్లో అత్యధిక సంఖ్యలో..
‘వాక్ ఫ్రీ’ తాజా నివేదికలో వెల్లడి
ఐరాస: ప్రపంచంలో ఆధునిక బానిసత్వాన మగ్గుతున్న 5 కోట్ల మందిలో సగానికి పైగా 20 సంపన్న దేశాల్లోనే ఉన్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ రూపొందించిన 172 పేజీల నివేదిక బుధవారం విడుదల అయింది. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో బానిసత్వం ఉన్నట్లు అంచనా వేసింది. నివేదిక రూపకల్పనకు విస్తృతస్థాయిలో ఇంటింటి సర్వేలు, బాధితులతో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ‘వాక్ ఫ్రీ’ వెల్లడించింది. ‘‘ఆధునిక బానిసత్వం సమాజంలోని ప్రతి అంశానికీ వ్యాపించింది’’ అని వాక్ ఫ్రీ వ్యవస్థాపక డైరెక్టర్ గ్రేస్ ఫారెస్ట్ తెలిపారు. నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలివే..
* బలవంతపు చాకిరీ లేదా బలవంతపు వివాహాలతో ‘ఆధునిక బానిసత్వం’లో జీవిస్తున్నవారిలో ఎక్కువమంది జీ-20లోని ఆరు దేశాల్లోనే ఉన్నారు. సంఖ్యాపరంగా.. అత్యధికంగా భారత్లో ఇలాంటివారు 1.1 కోట్ల మంది ఉండగా.. చైనా (58 లక్షల మంది), రష్యా (19 లక్షలు), ఇండొనేసియా (18 లక్షలు), తుర్కియే (13 లక్షలు), అమెరికా (11 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
* 2021 ఆఖరునాటికి 5 కోట్ల మంది ‘ఆధునిక బానిసత్వం’లో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ఐఎల్వో, ఐవోఎంలతోపాటు ‘వాక్ ఫ్రీ’ గత ఏడాది సెప్టెంబరులో రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఇందులో 2.8 కోట్ల మంది బలవంతపు చాకిరీలో, 2.2 కోట్ల మంది బలవంతపు వివాహాలతో మగ్గుతున్నారు. 2016తో పోలిస్తే ఇలాంటివారి సంఖ్య కోటి వరకు పెరిగింది.
* ‘ఆధునిక బానిసత్వం’ ఉత్తర కొరియా, ఎరిట్రియా, మారిటేనియా, సౌదీ అరేబియా, తుర్కియాల్లో చాలా ఎక్కువగా ఉంది. ప్రతి దేశంలోనూ అనేక రంగాల్లో బలవంతపు చాకిరీ కనిపిస్తోందని, బాల కార్మికులు ఎక్కువగా కోకా బీన్స్ సాగులో ఉన్నారని నివేదిక తెలిపింది.
* 2015లో ఐరాస నిర్దేశించిన లక్ష్యాల్లో.. 2030 నాటికి ఆధునిక బానిసత్వం, మానవ అక్రమరవాణా, నిర్బంధ చాకిరీ వంటివాటిని తుడిచిపెట్టడం ఒకటి. ప్రభుత్వాల చర్యల్లో స్తబ్దత, ఇలాంటివారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ లక్ష్యాన్ని సాధించడానికి మరింత సమయం పడుతుంది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఆధునిక బానిసత్వాన్ని అరికట్టేందుకు చర్యలను వేగవంతం చేయాలని నివేదిక సూచించింది. దీనికి రాజకీయ సంకల్పం కీలకమని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు