బైడెన్ను చంపుతానన్న సాయి వర్షిత్కు పదేళ్ల జైలుశిక్ష, రూ.2కోట్ల జరిమానా విధించే అవకాశం!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను చంపుతానంటూ ట్రక్కుతో వెళ్లి శ్వేతసౌధం బారికేడ్లను ఢీకొన్న భారత సంతతి యువకుడు సాయి వర్షిత్ కందుల (19)కు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష, రూ.2 కోట్ల (2,50,000 డాలర్లు) జరిమానా విధించే అవకాశముంది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను చంపుతానంటూ ట్రక్కుతో వెళ్లి శ్వేతసౌధం బారికేడ్లను ఢీకొన్న భారత సంతతి యువకుడు సాయి వర్షిత్ కందుల (19)కు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష, రూ.2 కోట్ల (2,50,000 డాలర్లు) జరిమానా విధించే అవకాశముంది. బుధవారం ఫెడరల్ కోర్టు జడ్జి రాబిన్ మెరివెదర్ ఎదుట వర్షిత్ను హాజరుపరచగా, మే 30 దాకా కస్టడీకి ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలోని మిసోరి రాష్ట్రానికి చెందిన సాయి వర్షిత్ గత సోమవారం రాత్రి ఓ ట్రక్కు నడుపుతూ శ్వేతసౌధం దిశగా దూసుకుపోయి బారికేడ్లను ఢీకొనడంతో భద్రతా సిబ్బంది అతణ్ని నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ట్రక్కులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించిన పోలీసులు జర్మనీ నియంత హిట్లర్కు చెందిన నాజీల జెండాను అందులో గుర్తించారు. బైడెన్ను తొలగించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యమని ప్రకటించిన వర్షిత్ తానొక నిరుద్యోగ డేటా అనలిస్ట్గా పరిచయం చేసుకున్నాడు. నారింజ రంగు జంప్సూట్లో కోర్టుకు హాజరైన వర్షిత్ జడ్జి అడిగిన ప్రశ్నలకు వినయంగా, పొడిగా బదులిచ్చాడు. ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపటం, అధ్యక్షుణ్ని చంపుతానని బెదిరించటం, అనుమతి లేకుండా చొరబడటం.. ఇలా పలు అభియోగాలను వర్షిత్పై పోలీసులు నమోదు చేశారు. ఈ నేరాలకు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశమున్నట్లు నిందితుడికి చెప్పిన న్యాయమూర్తి వచ్చే వారం తదుపరి విచారణ ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ వల్లే ఎన్నో ప్రాణాలు నిలిచాయి’: నౌకలోని భారత సిబ్బందికి బెడైన్ ప్రశంసలు
నౌక ఢీ కొనడంతో వంతెన కుప్పకూలిన అనూహ్య ఘటన అమెరికా(USA)లో చోటుచేసుకుంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. -
256 ఏళ్ల బ్రిటిష్ మ్యూజియం చరిత్రకు మచ్చ.. 1,800 పురాతన వస్తువుల చోరీ!
British Museum: లండన్లోని ప్రఖ్యాత బ్రిటిష్ మ్యూజియంలో 1,800 వస్తువులు చోరీకి గురైనట్లు నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. -
అమెరికా వంతెన ప్రమాదంలో నిలిచిపోయిన గాలింపు చర్యలు.. ఆరుగురి మృతి!
Baltimore bridge collapse: బాల్టిమోర్లో కుప్పకూలిన వంతెన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. -
అమెరికాలో కుప్పకూలిన వంతెన
అమెరికాలోని బాల్టిమోర్లో భారీ ప్రమాదం జరిగింది. సరకు రవాణా నౌక పిల్లర్ను ఢీకొనడంతో నదిపై ఉన్న కీలక వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నీటిలో పడిపోయాయి. -
అసాంజేకు ఊరట
గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను వెంటనే అమెరికాకు అప్పగించాల్సిన అవసరం లేదని బ్రిటన్ కోర్టు స్పష్టం చేసింది. -
న్యూజిలాండ్ పార్లమెంట్పై చైనా హ్యాకర్ల ఆపరేషన్!
తమ పార్లమెంటే లక్ష్యంగా చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్న హ్యాకర్లు 2021లో రహస్య ఆపరేషన్ చేపట్టారని న్యూజిలాండ్ ఆరోపించింది. -
బెల్జియం ప్రధానికి మోదీ ఫోను
బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్ డి క్రుతో ప్రధాని మోదీ మంగళవారం ఫోనులో సంభాషించారు. పశ్చిమాసియాతో పాటు రష్యా- ఉక్రెయిన్ వివాదంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు మద్దతు తదితర అంశాలపై ఇరు దేశాల నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. -
బాల్టిక్ ప్రాంతంలో జీపీఎస్ జామింగ్
బాల్టిక్ సముద్ర తీర ప్రాంతంలోని ఐరోపా దేశాల్ని జీపీఎస్ సిగ్నల్ సమస్య పీడిస్తోంది. గగనతలంలో ఉన్న విమానాలకు నకిలీ సంకేతాలు పంపి వాటి జాడను తప్పుగా చూపెడుతున్నాయంటూ ప్రముఖ ‘న్యూస్వీక్’ వార్తా సంస్థ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. -
రంజాన్కు కాల్పుల విరమణ లేనట్లే
గాజాలో కాల్పుల విరమణ కోసం రెండువైపుల నుంచి వచ్చిన డిమాండ్లను ఇరుపక్షాలు పరస్పరం అంగీకరించలేదు. -
ఆ తండ్రికి రూ.వందల కోట్ల ఆస్తి.. సామాన్యుడిలా పెరిగిన కుమారుడు
మనిషి సాధారణ వ్యక్తిగా పెరిగితేనే జీవితంలో విజయం సాధించడం కోసం కష్టపడి పనిచేస్తాడనేది జాంగ్ యుడాంగ్ అభిప్రాయం. -
ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వానికి అండగా ఉంటాం : జైశంకర్
సార్వభౌమత్వ పరిరక్షణలో ఫిలిప్పీన్స్కు భారత్ పూర్తి అండగా నిలుస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. -
చైనీయులే లక్ష్యంగా పాక్లో ఉగ్రదాడి!
పాకిస్థాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో అయిదుగురు చైనీయులు, ఓ పాకిస్థానీ సహా నలుగురు ఉగ్రవాదులు మరణించారు. -
భూగర్భ డ్రైనేజీలో 36 గంటలు.. దాక్కొన్నాడా.. దబాలున పడ్డాడా!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో భూగర్భ డ్రైనేజీలోకి దిగిన ఓ యువకుడు దాదాపు 36 గంటలు అందులోనే చిక్కుకుపోయాడు. -
రామకృష్ణ మిషన్ అధ్యక్షుడి కన్నుమూత
రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద (95) మంగళవారం రాత్రి కోల్కతాలో కన్నుమూశారు. వయో సంబంధిత రుగ్మతలతో ఆయన తుదిశ్వాస విడిచారు. -
సీఏఏ అమలుపై అమెరికా ఆందోళన
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. -
పుడమిని తాకిన శక్తిమంతమైన సౌరతుపాను
ఆరేళ్లలో ఎన్నడూ లేనంత శక్తిమంతమైన సౌర తుపాను తాజాగా భూమిని తాకింది. ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ పేర్కొంది. -
మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా.. తొలిసారి ప్రాతినిధ్యం!
ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్ యూనివర్స్ (Miss Universe 2024) పోటీల్లో సౌదీ అరేబియా తొలిసారి పాల్గొననుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన
-
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
-
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..