పరుగుతో వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి మెరుగు
వ్యాయామంలో భాగంగా నడివయసులో పరిగెత్తడం వల్ల.. వార్ధక్యంతో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గుతాయని అమెరికా, మెక్సికో శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
దిల్లీ: వ్యాయామంలో భాగంగా నడివయసులో పరిగెత్తడం వల్ల.. వార్ధక్యంతో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గుతాయని అమెరికా, మెక్సికో శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. యవ్వన దశలోకి వచ్చాక కొత్తగా ఏర్పడ్డ నాడీ కణాలను ఒక కీలక నెట్వర్క్తో అనుసంధానించడానికి ఇది వీలు కల్పిస్తుందని వారు తేల్చారు. వయసు మీద పడే క్రమంలో ‘ఎపిసోడిక్ మెమరీ’ నిర్వహణకు ఈ నెట్వర్క్ అవసరం. గతంలో జరిగిన అనుభవాలను, వాటితో ముడిపడ్డ సమయం, ప్రదేశం, భావాలతో సహా గుర్తుచేసుకోవడానికి ఎపిసోడిక్ మెమరీ దోహదపడుతుంది.
వార్ధక్యం వల్ల క్రమంగా విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతుంది. మెదడులోని హిప్పోక్యాంపల్ పరిమాణంలో మార్పులే ఇందుకు కారణం. హిప్పోక్యాంపస్, దానిపక్కన ఉన్న కార్టిస్లు.. అభ్యాసం, జ్ఞాపకశక్తికి చాలా కీలకం. వార్ధక్యం వల్ల మెదడులోని పెరిహైనల్, ఎంట్రోహైనల్ కార్టెక్స్ నుంచి హిప్పోక్యాంపస్కు వచ్చే సమాచారం క్షీణతకు గురి కావడం వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. సందర్భం, భిన్న అంశాలను గుర్తుపెట్టుకోవడంలో దోహదపడే ‘కాంటెక్స్ట్వల్ మెమరీ’లో ఈ భాగాలకు ప్రమేయం ఉంది. దీర్ఘకాల పరుగుల వల్ల.. యవ్వనంలో పుట్టుకొచ్చిన న్యూరాన్లు పెరగడంతోపాటు పెరిహైనల్ సంధానతలు బలోపేతమయ్యాయి. దీనికితోడు ఆ కొత్త న్యూరాన్లకు ఎంటిరోహైనల్ కార్టిస్ల తోడ్పాటు పెరిగింది. ఫలితంగా విషయగ్రహణ ప్రక్రియలో వాటి భాగస్వామ్యం మెరుగైంది. వార్ధక్యంతో వచ్చే జ్ఞాపకశక్తి క్షీణతను ఇవి దూరం చేశాయి. ఒకే తరహా ఘటనల మధ్య వైరుధ్యాన్ని గుర్తించడానికి ఇది వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.