కీవ్పై భారీగా డ్రోన్ల దాడి
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా సైన్యం భారీగా డ్రోన్లతో దాడికి దిగింది. ఇందులో ఒకరు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.
ఒకరి మృతి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా సైన్యం భారీగా డ్రోన్లతో దాడికి దిగింది. ఇందులో ఒకరు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లతో శనివారం రాత్రి జరిగిన ఈ దాడి ఐదు గంటలకుపైగా సాగినట్లు వివరించారు. ఆదివారం కీవ్వాసులు తమ నగర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో రష్యా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం. గత ఏడాది రష్యా-ఉక్రెయిన్ మొదలైనప్పటి నుంచి కీవ్పై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని సైనికాధికారులు తెలిపారు. డ్రోన్ శకలాలు నగరంలోని ఏడు అంతస్థుల భవనంపై పడి, మంటలు చెలరేగాయని తెలిపారు. మరోవైపు ఖర్కీవ్ ప్రావిన్స్లో రష్యా చేపట్టిన శతఘ్ని దాడిలో ఇద్దరు వృద్ధులు చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mahindra: కెనడాలో ‘మహీంద్రా’ అనుబంధ సంస్థ మూత!
-
Ramesh Bidhuri: భాజపా ఎంపీ వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా సీరియస్!
-
Asian Games: అరుణాచల్ అథ్లెట్లపై ‘చైనా’ వివక్ష.. దీటుగా స్పందించిన భారత్
-
Rahul Gandhi : ‘మహిళా రిజర్వేషన్ల’ను తక్షణమే అమలు చేయొచ్చు..! రాహుల్ గాంధీ
-
Chandrababu Arrest: రెండ్రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు
-
Pattabhi: ఉండవల్లి తన వ్యక్తిత్వాన్ని తానే చంపుకొన్నారు: పట్టాభి