టిప్పు సుల్తాన్‌ తుపాకీని దేశం దాటనీయొద్దు

మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ ఉపయోగించిన అరుదైన తుపాకీ ఎగుమతిపై బ్రిటన్‌ నిషేధం విధించింది. ఇది దేశం దాటి వెళ్లకూడదని, భారత్‌-బ్రిటిష్‌ సంబంధాలను అధ్యయనం చేయడానికి ఈ అరుదైన, విలువైన (సుమారు రూ.20 లక్షల ఖరీదు) ఆయుధం కీలకమని పేర్కొంది.

Published : 30 May 2023 04:53 IST

ఎగుమతిపై బ్రిటన్‌ నిషేధం

లండన్‌: మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ ఉపయోగించిన అరుదైన తుపాకీ ఎగుమతిపై బ్రిటన్‌ నిషేధం విధించింది. ఇది దేశం దాటి వెళ్లకూడదని, భారత్‌-బ్రిటిష్‌ సంబంధాలను అధ్యయనం చేయడానికి ఈ అరుదైన, విలువైన (సుమారు రూ.20 లక్షల ఖరీదు) ఆయుధం కీలకమని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లింట్లాక్‌ స్పోర్టింగ్‌ గన్‌ అని పిలిచే ఈ తుపాకీ 1793-94 కాలానికి చెందినది. ఈ సింగిల్‌ బ్యారెల్‌ తుపాకీ నుంచి రీలోడింగ్‌ చేయకుండానే ఒకేసారి సారి రెండు తూటాలు వెలువడతాయి. తయారు చేసిన అసద్‌ ఖాన్‌ మహ్మద్‌ సంతకం కూడా దీనిపై ఉంది. ఇది అప్పటి జనరల్‌ కార్న్‌వాలిస్‌కు బహుమతిగా వచ్చిందని బ్రిటన్‌ వర్గాలు చెబుతున్నాయి. టిప్పు సుల్తాన్‌కు చెందిన ఓ కత్తికి ఇటీవల వేలంలో రూ.144 కోట్ల ధర పలికిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని