కంబోడియా రాజుతో మోదీ చర్చలు
భారత్లో పర్యటిస్తున్న కంబోడియా రాజు నరోదమ్ శిహమోనితో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చలు జరిపారు.
దిల్లీ: భారత్లో పర్యటిస్తున్న కంబోడియా రాజు నరోదమ్ శిహమోనితో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరిగింది. కంబోడియాతో ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ గట్టిగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధం ఉందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా శిహమోనితో భేటీ అయ్యారు. రక్షణ, పార్లమెంటరీ వ్యవహారాల్లో ఇరు దేశాల మధ్య సహకరించుకునే అంశంపై చర్చించారు. అంతకుముందు శిహమోనికి రాష్ట్రపతి భవన్లో ద్రౌపదీ ముర్ము లాంఛనంగా ఘన స్వాగతం పలికారు. శిహమోని.. రాజ్ఘాట్ వెళ్లి, మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!