విద్వేషాల వ్యాప్తికి ప్రసార సమయం ఇవ్వొద్దు
విద్వేషాలు పెంచేవారికి, కుట్రదారులకు, వారి సహాయకులకు ప్రసార సమయం కేటాయించకుండా బహిష్కరించాలంటూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) దేశంలోని శాటిలైట్ టీవీ ఛానళ్లను కోరింది.
ఇమ్రాన్ లక్ష్యంగా పాక్ ఎలక్ట్రానిక్ మీడియా నోటిఫికేషన్
ఇస్లామాబాద్, లాహోర్: విద్వేషాలు పెంచేవారికి, కుట్రదారులకు, వారి సహాయకులకు ప్రసార సమయం కేటాయించకుండా బహిష్కరించాలంటూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) దేశంలోని శాటిలైట్ టీవీ ఛానళ్లను కోరింది. మే 9న ఇమ్రాన్కు మద్దతుగా పాక్లో పలుచోట్ల చెలరేగిన హింసాకాండను దృష్టిలో పెట్టుకొని పీఈఎంఆర్ఏ బుధవారం ఈ నోటిఫికేషను జారీ చేసింది. ‘‘అప్రమత్తంగా ఉండండి. విద్వేషాలు వ్యాప్తి చేయొద్దు. కుట్రదారులను ప్రోత్సహించవద్దు’’ అని అందులో కోరారు.
ఇమ్రాన్ పార్టీ అధ్యక్షుడు ఇలాహీ అరెస్ట్
పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు సన్నిహితుడు అయిన చౌదరీ పర్వేజ్ ఇలాహీని గురువారం ఆయన ఇంటి బయట అరెస్టు చేశారు. మే 26న లాహోర్ జిల్లా కోర్టు ఇలాహీకి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్లో భారత హైకమిషనర్కు నిరసన సెగ.. గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డగింత
-
Chidambaram: మహిళా రిజర్వేషన్.. నీటిలో జాబిల్లి: కాంగ్రెస్ నేత చిదంబరం
-
ODI WC 2023: వరల్డ్ కప్ వారిదే.. ఫేవరెట్ టీమ్ చెప్పేసిన సునీల్ గావస్కర్
-
Smile Pinki: ఆస్కార్ విజేత పింకీ ఇంటికి కూల్చివేత నోటీసులు
-
Kantara: ‘కాంతార’కు ఏడాది.. నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్ట్
-
Vijayawada: విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్