ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తే సహించం: బ్రిక్స్
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాడుతామని శుక్రవారం బ్రిక్స్ దేశాలు ప్రకటించాయి.
కేప్టౌన్: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాడుతామని శుక్రవారం బ్రిక్స్ దేశాలు ప్రకటించాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్నీ అడ్డుకుంటామనీ, వారికి ఆశ్రయం కల్పించే దేశాలనూ ఎదుర్కొంటామని పేర్కొన్నాయి. ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తోందని భారత్ మొదటి నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పాక్ పేరెత్తకుండా ఉగ్రవాదుల ఆశ్రయ స్థలాలపై పోరాడతామని బ్రిక్స్ విదేశాంగ మంత్రులు ఇక్కడ విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొనడం కీలక పరిణామం. భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో బ్రిక్స్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి ఎవరు ఎక్కడ ఎప్పుడు పాల్పడినా ఖండిస్తామని బ్రిక్స్ సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధానికి ఐక్యరాజ్యసమితి ఛత్రంలో సమగ్ర ఒప్పందాన్ని త్వరగా చేపట్టాలని పిలుపునిచ్చింది. జీవ, రసాయనాస్త్రాలతో ఉగ్రవాదానికి పాల్పడకుండా అంతర్జాతీయ ఒప్పందం కుదరాలనీ కోరింది. ఉగ్రవాదంపై పోరాటానికి బ్రిక్స్ ఏర్పాటుచేసిన కార్యబృందం పనితీరును ప్రశంసించింది. ఈ పోరులో మరింతగా సహకరించుకోవాలని పిలుపు ఇచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన దరిమిలా రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్యలు విధించిన ఆర్థిక ఆంక్షలను నేరుగా ప్రస్తావించకుండా ఇటువంటి ఏకపక్ష ఆర్థిక చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తాయని సంయుక్త ప్రకటన హెచ్చరించింది. పరస్పర ఆర్థిక సహకార వృద్ధికి భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ 20 కృషి చేస్తుందని ఉద్ఘాటించింది. బ్రిక్స్ దేశాల మధ్య, వాటి వాణిజ్య భాగస్వాముల మధ్య స్థానిక కరెన్సీల్లోనే వ్యాపారం జరగడం ముఖ్యమని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి విభాగాలను సంస్కరించాలనీ, సమితిలో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు మరింత ప్రముఖ పాత్ర లభించాలని పిలుపు ఇచ్చింది. పారిస్ వాతావరణ సభ తీర్మానాలను అమలు చేయడానికి బ్రిక్స్ కట్టుబడి ఉందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్