లిబియా నుంచి 9 మంది భారత నావికుల విడుదల
లిబియాలోని స్థానిక మిలీషియా వద్ద కొన్ని నెలల పాటు బందీగా ఉన్న వ్యాపార నౌకకు చెందిన 9 మంది భారత నావికులు విడుదలయ్యారు.
దిల్లీ: లిబియాలోని స్థానిక మిలీషియా వద్ద కొన్ని నెలల పాటు బందీగా ఉన్న వ్యాపార నౌకకు చెందిన 9 మంది భారత నావికులు విడుదలయ్యారు. గత బుధవారం విడుదలైన వీరికి లిబియా రాజధాని ట్రిపోలిలో భారత రాయబార అధికారులు స్వాగతం పలికినట్లు తాజాగా తెలిసింది. లిబియా సముద్రతీరంలో తమ నౌక ఎంటీ మాయ-1 విరిగిపోవడంతో అక్కడే చిక్కుకుపోయిన నావికులను మిలీషియా బంధించిందని టునీషియాలో భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందింది. వారిని సురక్షితంగా, సాధ్యమైనంత త్వరగా భారత్కు అప్పగించే విషయంలో లిబియా ప్రభుత్వంతో అధికారులు సంప్రదింపులు జరిపారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా లిబియాతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపింది. ఎట్టకేలకు వారు లిబియా నుంచి సురక్షితంగా విడుదలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్
-
భాజపా ఎమ్మెల్యే నివాసంలో యువకుడి ఆత్మహత్య: ప్రియురాలితో గొడవే కారణం
-
చంద్రయాన్-3 మహా క్విజ్లో పాల్గొనండి
-
ఆ పదవిలో ఎంతకాలం ఉంటానో చెప్పలేను..
-
కళ్లు పీకి.. జుట్టు కత్తిరించి... యువతి దారుణ హత్య!
-
భారాసను వీడాలని బోథ్ ఎమ్మెల్యే నిర్ణయం