ఈజిప్టు సరిహద్దుల్లో ఘర్షణ
ఈజిప్టు సరిహద్దుల్లో శనివారం జరిగిన రెండు ఘర్షణల్లో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు, ఓ ఈజిప్టు సైనికుడు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ముగ్గురు ఇజ్రాయెల్ సైనికుల మృతి
జెరూసలెం: ఈజిప్టు సరిహద్దుల్లో శనివారం జరిగిన రెండు ఘర్షణల్లో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు, ఓ ఈజిప్టు సైనికుడు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఈజిప్టు సైన్యం దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి తమ ఇద్దరు సైనికులను కాల్చి చంపాడని తెలిపింది. మరో కాల్పుల ఘటనలో ఓ ఈజిప్టు బోర్డర్ సెక్యూరిటీ గార్డుతో పాటు తమ దేశసైనికుడొకరు మృతి చెందారని పేర్కొంది. ఈ విషయాన్ని ఈజిప్టు ధ్రువీకరించింది. మాదకద్రవ్యాల ముఠాను వెంటాడుతూ తమ సైనికుడు ఇజ్రాయెల్ సరిహద్దు దాటాడని, ఆ సందర్భంగా ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయని తెలిపింది. దశాబ్దానికి పైగా ప్రశాంతంగా ఉన్న ఈజిప్టు-ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా