మీ బాధను పంచుకుంటున్నాం.. భారత్కు అండగా ఉన్నాం
ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్, జపాన్ ప్రధాన మంత్రులు ఫుమియో కిషిదా, రిషి సునాక్ నుంచి ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కోరోసి వరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
రైలు ప్రమాదంపై ప్రపంచ నేతల సంతాపం
మాస్కో, టోక్యో: ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్, జపాన్ ప్రధాన మంత్రులు ఫుమియో కిషిదా, రిషి సునాక్ నుంచి ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కోరోసి వరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
* రైలు ప్రమాదంతో ప్రభావితమైన వారి గురించే నా ప్రార్థనలు. ఒడిశాలో చోటుచేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ప్రాణాలతో బయటపడినవారికి, సహాయక చర్యల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వారికి నా ప్రశంసలు.
రిషి సునాక్, బ్రిటన్ ప్రధాని
* రైలు ప్రమాదంలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంపై దిగ్భ్రాంతికి గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.
షీ జిన్పింగ్, చైనా అధ్యక్షుడు
* ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జపాన్ ప్రభుత్వం, ప్రజల తరఫున సంతాపాన్ని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.
ఫుమియో కిషిదా, జపాన్ ప్రధాని
* రైలు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను మేం పంచుకుంటున్నాం. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.
పుతిన్, రష్యా అధ్యక్షుడు
* ఒడిశా విషాద ఘటన దిగ్భ్రాంతికరం. ఉక్రెయిన్ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు బాధితుల కుటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.
వొలొదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు.
* భారత్లో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు కలవరపరిచాయి. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో కెనడా పౌరులు భారత ప్రజలకు అండగా ఉన్నారు.
జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని
* రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నా.
ప్రచండ, నేపాల్ ప్రధాని
* రైలు ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నా.
సాబా కొరోసీ, ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు
* భారత్లో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.
షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ ప్రధాని
* రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి మోదీ, భారత ప్రజలకు నా ప్రగాఢ సంతాపం. ఫ్రాన్స్ మీకు సంఘాభావంగా నిలుస్తుంది.
ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..