అమర్నాథ్ గుహలో ప్రత్యేక పూజలు
అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి గుర్తుగా ఆ శివ లింగం కొలువుదీరే అమర్నాథ్ గుహలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి.
యాత్ర ప్రారంభానికి గుర్తుగా..
శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి గుర్తుగా ఆ శివ లింగం కొలువుదీరే అమర్నాథ్ గుహలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రథమ పూజగా పిలిచే ఈ క్రతువులో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా దృశ్యమాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరమశివుని భక్తులకు అమర్నాథ్ రావడం ఓ జీవిత కాలపు కల అని ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఈ యాత్ర వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి లభిస్తుందని, యాత్ర విజయవంతం కావడానికి వారు ఇతోధికంగా సాయపడుతున్నారన్నారు. యాత్రికుల రక్షణకు, కనీస అవసరాలు తీర్చడానికి శ్రీ అమర్నాథ్ జీ దేవస్థానం బోర్డు (ఎస్ఏఎస్బీ) కృషి చేస్తోందని ఎల్జీ వెల్లడించారు. జులై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్పవార్ ఏమన్నారంటే..