సంక్షిప్త వార్తలు(4)
రోదసిలోని తమ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలల పాటు విజయవంతంగా విధులు నిర్వర్తించిన ముగ్గురు చైనా వ్యోమగాములు ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు.
క్షేమంగా భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు
బీజింగ్: రోదసిలోని తమ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలల పాటు విజయవంతంగా విధులు నిర్వర్తించిన ముగ్గురు చైనా వ్యోమగాములు ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. షెంజౌ-15 వ్యోమనౌకలో వీరు ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్లో దిగారు. అనంతరం విమానంలో బీజింగ్ చేరుకున్నారు. ఈ వ్యోమగాములు కొంతకాలం పాటు మెడికల్ క్వారంటైన్లో ఉంటారు. ఆ సమయంలో వారిపై సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీరి స్థానంలో మరో ముగ్గురు వ్యోమగాములు మే 30న అంతరిక్ష కేంద్రానికి చేరిన సంగతి తెలిసిందే. వారు ఐదు నెలల పాటు అక్కడ విధులు నిర్వర్తిస్తారు.
డీఎన్ఏ పరీక్షల ఆధారంగా చిన్నారుల కెరీర్ ప్రణాళిక ప్రత్యేక సాఫ్ట్వేర్ సిద్ధం
వాషింగ్టన్: పిల్లల లాలాజలం నుంచి సేకరించిన జన్యువులను విశ్లేషించడం ద్వారా వారికి అనువైన కెరీర్ ప్రణాళికను సూచించే ఒక సాఫ్ట్వేర్ సిద్ధమైంది. భారత అమెరికన్ వ్యాపారవేత్త మహ్మద్ ముస్తఫా దీన్ని రూపొందించారు. దేశంలో నైపుణ్యానికి సరైన మార్గనిర్దేశం చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన వివరించారు. దీని ఆధారంగా సంబంధిత చిన్నారికి ప్రత్యేకమైన పాఠశాల విద్యను అందించొచ్చని పేర్కొన్నారు.
‘‘ప్రతి చిన్నారికీ ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి. జన్యువులు ఆధారంగా దీన్ని అర్థంచేసుకోవచ్చు. తద్వారా పిల్లల భవితపై సరైన అవగాహన ఏర్పడుతుంది. దీని ప్రాతిపదికన 10-15 ఏళ్ల కెరీర్ వృద్ధి, నైపుణ్య ప్రణాళికను మేం అందించగలం’’ అని మహ్మద్ ముస్తఫా వివరించారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలు.. ‘ప్రతి చిన్నారికి అన్నీ బోధించాలి’ అనే రీతిలో సాగుతున్నాయని తెలిపారు. ‘‘తర్వాతి దశలో కొన్ని దేశాలు మేధో పరీక్షలు నిర్వహించి, పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటి ఆధారంగా చిన్నారుల కెరీర్ను నిర్ణయిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. పిల్లల సామర్థ్యాన్ని జన్యువుల ద్వారా తెలుసుకోవడానికి పూర్తిస్థాయిలో జీన్ మ్యాపింగ్ చేస్తామని తెలిపారు.
చైనాలో విరిగిపడిన కొండ చరియలు
14 మంది మృతి
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో కొండ చరియలు విరిగిపడటంతో కనీసం 14 మంది మరణించారు. మరో అయిదుగురి జాడ తెలియడం లేదు. లేషన్ నగరంలో ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం 180 మంది సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారని అధికారులు తెలిపారు.
సూయిజ్ కాలువలో ఆగిపోయిన చమురు ట్యాంకర్
కైరో: ముడి చమురును సరఫరా చేస్తున్న ఓ ట్యాంకర్ ఆదివారం ఈజిప్ట్లోని సూయిజ్ కాలువలో మరమ్మతుకు గురై ఆగిపోయింది. దీంతో ఈ జలమార్గంలో రవాణాకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు చమురును సరఫరా చేస్తున్న మాల్టా దేశ నౌకకు యాంత్రికపరమైన లోపం తలెత్తడంతో ఆగిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో ఈ ట్యాంకర్ వెనక మరో ఎనిమిది నౌకలు ఆగిపోయాయని పేర్కొన్నారు. మూడు పడవలు కొన్ని గంటలపాటు శ్రమించి ఆ ట్యాంకర్ను వేరే చోటుకు తరలించాయని, దీంతో అక్కడి ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.