ఉక్రెయిన్లో డ్యాం పేల్చివేత
ఉక్రెయిన్ భయపడినంతా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున భీకర పోరు జరుగుతున్న దక్షిణ ఉక్రెయిన్లోని నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యాం పేల్చివేతతో అత్యవసర పరిస్థితి తలెత్తింది.
సమీప ప్రాంతాల్లోకి వెల్లువెత్తిన వరద
ఖాళీ చేస్తున్న జనం
అణు విద్యుత్తు కేంద్రానికి ముప్పు!
కీవ్: ఉక్రెయిన్ భయపడినంతా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున భీకర పోరు జరుగుతున్న దక్షిణ ఉక్రెయిన్లోని నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యాం పేల్చివేతతో అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో సమీప ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతోంది. మరోవైపు ఐరోపాలోని అతి పెద్ద అణు విద్యుత్తు కేంద్రం జపోరిజియాకు ముప్పు ఏర్పడింది. తాగునీటి సరఫరాకూ ఆటంకం కలగనుంది. ఈ పేల్చివేతకు రష్యా కారణమని ఉక్రెయిన్ అంటుండగా.. ఉక్రెయినే పేల్చి వేసిందని రష్యా అంటోంది. డ్యాంకు సమీపంలోని రెండు దేశాలకు చెందిన వారిని ఖాళీ చేయించే పనిలో ఉక్రెయిన్, రష్యా నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం నీపర్ నదీ ప్రాంతం, దానిపై ఉన్న జల విద్యుత్తు కేంద్రం రష్యా అధీనంలో ఉన్నాయి. ఉక్రెయిన్లోని ఖేర్సన్కు 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ డ్యాం వ్యూహాత్మకంగా చాలా కీలకం. గత కొన్ని నెలలుగా దీని సమీపంలో భారీగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ ఉక్రెయిన్ మిలిటరీ కమాండ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. రష్యా దళాలే పేల్చివేశాయని ఆరోపించింది. మరోవైపు ఆక్రమిత ఉక్రెయిన్లోని రష్యా అధికారులు ఇది ఉగ్రదాడని చెబుతున్నట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. రష్యా స్థానిక మేయర్ వ్లాదిమిర్ లియోనేటివ్ మాట్లాడుతూ.. ‘అర్ధరాత్రి రెండు గంటల నుంచి కఖోవ్కా డ్యాంపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు గేటు వాల్వులు దెబ్బతిన్నాయి. ఫలితంగా నీటి లీకులు మొదలయ్యాయి. కొద్దిసేపటికే నియత్రించలేని విధంగా నీరు కిందకు ప్రవహించడం మొదలైంది’ అని వెల్లడించారు. డ్యాం పేల్చివేతతో వేల మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని రష్యా అధికారిక మీడియా పేర్కొంది. మరోవైపు నీపర్ నదికి తూర్పు తీరాన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని ఉక్రెయిన్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
డ్యాం ఎందుకంత కీలకం?
ఉక్రెయిన్లో అతి పెద్ద డ్యాంలలో ఒకటైన కఖోవ్కా ఎత్తు 30 మీటర్లు. 1956లో జల విద్యుత్తు కేంద్రంలో భాగంగా ఖేర్సన్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో దీనిని నిర్మించారు. రష్యా అధీనంలోని ప్రాంతంలో ఉన్న ఈ రిజర్వాయర్లో నిల్వ ఉండే నీరు అమెరికాలోని గ్రేట్ సాల్ట్ లేక్లోని నీటికి సమానం. మొత్తం 18 మిలియన్ల క్యూబిక్ మీటర్ల (4.8 బిలియన్ల గాలన్లు) నీరు ఉంటుంది. దక్షిణ ఉక్రెయిన్లో విద్యుత్తు, సాగునీటి, తాగునీటి అవసరాలకు ఇదే పెద్ద ఆధారం. జపోరిజియా అణు విద్యుత్తు కేంద్ర కూలింగ్ అవసరాలనూ తీరుస్తుంది.
* యుద్ధం ప్రారంభమైన మొదట్లోనే రష్యా ఈ డ్యాంను అధీనంలోకి తీసుకుంది. అప్పట్లోనే డిటోనేటర్లను వాడటంతో మూడు స్లూయిజ్ గేట్లు ధ్వంసమయ్యాయి. అయినా రష్యా వాటికి మరమ్మతులు చేయించలేదు. మంగళవారం డ్యాం పేల్చివేతతో తీవ్ర ఆందోళన నెలకొంది.
* మంగళవారం తెల్లవారుజామున 2.50 గంటలకు రష్యా దళాలు డ్యాంను పేల్చివేశాయని, 80 గ్రామాలకు వరద ముప్పు తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. జపోరిజియా కూలింగ్ వ్యవస్థను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
* ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మక్ వరదలకు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. 45వేల మంది నివశించే కఖోవ్కా పట్టణంలోని పరిపాలనా కార్యాలయం ఉన్న వీధుల్లో వరద పారుతోంది.
* డ్యాం కూల్చివేతపై రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఎవరు చేశారనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇరు దేశాలకూ ఈ డ్యాంతో ప్రయోజనాలున్నాయి. దక్షిణ భాగంలో రష్యాపై ఎదురు దాడులకు దిగుతున్న ఉక్రెయిన్కు డ్యాం కూలడం పెద్ద దెబ్బ. డ్యాంను కవచంగా వాడుకునే ఉక్రెయిన్ దాడులకు వ్యూహం పన్నింది.
* ఈ రిజర్వాయరు నుంచే 2014లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియాకు నీటి సరఫరా జరుగుతుంటుంది.
రష్యా ఉగ్ర దేశం: ఉక్రెయిన్
ద హేగ్: రష్యాను ఉగ్ర దేశంగా ఉక్రెయిన్ అభివర్ణించింది. నెదర్లాండ్స్లోని ద హేగ్లో ఉన్న ఐక్యరాజ్య సమితి అత్యున్నత న్యాయస్థానంలో ఆ దేశానికి వ్యతిరేకంగా మంగళవారం ఉక్రెయిన్ దౌత్యవేత్త వాదనలను వినిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్