కర్బన ఉద్గారాల పరిహారం 170 లక్షల కోట్ల డాలర్లు.. నిజంగా చెల్లిస్తే ప్రతి భారతీయుడికి 1,446 డాలర్లు
భూతాపం పెరుగుదలను 2050కల్లా 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలంటే ప్రపంచ దేశాలు అప్పటికి కర్బన ఉద్గారాల తటస్థత (నెట్ జీరో)ను అందుకోవలసి ఉంటుంది.
దిల్లీ: భూతాపం పెరుగుదలను 2050కల్లా 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలంటే ప్రపంచ దేశాలు అప్పటికి కర్బన ఉద్గారాల తటస్థత (నెట్ జీరో)ను అందుకోవలసి ఉంటుంది. 2015 పారిస్ వాతావరణ సభలో ప్రపంచ దేశాలు భూతాపాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తామని ప్రకటించినా ఇప్పటికే భూ ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.15 డిగ్రీలకు చేరుకుంది. 2050కల్లా నెట్ జీరో సాధించాలంటే అన్ని దేశాలు తమ వంతు కర్బన ఉద్గారాలను తగ్గించాల్సి ఉంటుంది. దీన్ని కర్బన బడ్జెట్ అంటారు. కానీ, భారత్ వంటి దేశాలు ఈ బడ్జెట్ కన్నా కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేస్తుండగా, అమెరికా, జర్మనీ, రష్యా, బ్రిటన్, జపాన్ నిర్ణీత వాటా కన్నా 90 శాతం ఎక్కువ ఉద్గారాలను వెదజల్లుతున్నాయి. దీనికి అవి పరిహారం చెల్లించాల్సి వస్తే అది 131 లక్షల కోట్ల డాలర్లుగా లెక్కతేలుతుంది. చైనా, ఐరోపా సమాఖ్య (ఈయూ), బ్రెజిల్, ఇండోనేసియా దేశాల ఉద్గారాలనూ కలుపుకొని పరిహారాన్ని లెక్కిస్తే 170 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఆ డబ్బును నిజంగా చెల్లిస్తే భారత్ వాటా కింద ప్రతి భారతీయుడికి 2050 వరకు తలసరిన 1,446 డాలర్ల వార్షిక పరిహారం లభిస్తుందని బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అంచనా.
భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద కట్టడి చేయడానికి భారత్ తన కర్బన ఉద్గారాలలో భారీగా కోత పెట్టుకున్నందుకు అది సముచిత పరిహారం అవుతుందని వారన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటూ ఉంటే పారిశ్రామిక సంపన్న దేశాలు అన్యాయంగా ఉద్గారాలను పెంచుతున్నాయని లీడ్స్ పరిశోధకులు అన్నారు. అంతర్జాతీయ కర్బన ఉద్గారాల తలసరి సగటు 6.3 టన్నులయితే భారత్ వాటా కేవలం 2.4 టన్నులని నిరుడు ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ తెలిపింది. సగటున అమెరికా 14 టన్నులు, రష్యా 13, చైనా 9.7, బ్రెజిల్ 7.5 టన్నుల చొప్పున, ఐరోపా సమాఖ్య 7.2 టన్నుల చొప్పున కర్బన ఉద్గారాలను వెదజల్లుతున్నాయి. తమ వాటాకు మించి కర్బన ఉద్గారాలను విరజిమ్ముతున్న దేశాలు, తక్కువ ఉద్గారాలను ప్రసరించే అల్పాదాయ దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ వినవస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా