భారత సంతతి శాస్త్రవేత్తకు డచ్‌ నోబెల్‌ అవార్డు

భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త జోయీతా గుప్తాను స్పినోజా ప్రైజ్‌ వరించింది. డచ్‌కు సంబంధించి సైన్స్‌ విభాగంలో అత్యున్నతమైన ఈ అవార్డును డచ్‌ నోబెల్‌ పురస్కారంగానూ అభివర్ణిస్తారు.

Published : 08 Jun 2023 06:13 IST

సుస్థిర ప్రపంచం కోసం పరిశోధనలకు గుర్తింపు

దిల్లీ: భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త జోయీతా గుప్తాను స్పినోజా ప్రైజ్‌ వరించింది. డచ్‌కు సంబంధించి సైన్స్‌ విభాగంలో అత్యున్నతమైన ఈ అవార్డును డచ్‌ నోబెల్‌ పురస్కారంగానూ అభివర్ణిస్తారు. సుస్థిర ప్రపంచం అనే అంశంపై గుప్తా చేసిన స్ఫూర్తికరమైన పరిశోధనకు ఈ అవార్డు లభించిందని ఆమ్‌స్టర్‌డాం విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అక్టోబరు 4న జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును జోయీతాకు అందజేయనున్నారు. దీంతో పాటు ఆమె పరిశోధనకు ప్రోత్సాహకంగా 15 లక్షల యూరోలు అందిస్తారు. ప్రస్తుతం జోయీతా.. ఆమ్‌స్టర్‌డాం వర్సిటీలో ‘దక్షిణార్ధ గోళంలో పర్యావరణం, అభివృద్ధి’ అనే అంశంపై ప్రొఫెసర్‌గా, ఎర్త్‌ కమిషన్‌కు సహ అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని