మోదీ పర్యటనతో బంధం బలోపేతం
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 22 నుంచి అమెరికాలో నిర్వహించనున్న పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని శ్వేతసౌధం పేర్కొంది.
రక్షణ రంగంలో భాగస్వామ్యం మెరుగవుతుంది
శ్వేతసౌధం ఆశాభావం
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 22 నుంచి అమెరికాలో నిర్వహించనున్న పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని శ్వేతసౌధం పేర్కొంది. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని బుధవారం ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వెల్లడించింది. ఇరుదేశాల అభివృద్ధి, సాంకేతికత, వాణిజ్యం, పరిశ్రమలు, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల గురించి ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలూ చర్చించనున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, రక్షణ రంగంలో వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకునేందుకు కీలక చర్చలు జరుగుతాయని తెలిపింది. అమెరికా నలుమూలల నుంచి తరలివచ్చే భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఈ నెల 23న మోదీ ప్రసంగిస్తారు. భారతదేశ ప్రగతి గాథలో భారత సంతతివారి పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తారని భారతీయ అమెరికన్ సంఘ నాయకుడు డాక్టర్ భారత్ బరాయ్ బుధవారం వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP High Court: అమరావతి రింగ్రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆరుగురి అరెస్ట్!
-
colors swathi: విడాకుల వార్తలపై విలేకరి ప్రశ్న.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన ‘కలర్స్’ స్వాతి
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Asian Games: 10వేల మంది ఉన్న స్టేడియంలో పోయిన ఫోన్.. కనిపెట్టారిలా..!
-
Viral Video: ఇంటి కిటికీలో ఇరుక్కుపోయిన కొండచిలువ.. ఆ తర్వాతేం జరిగిందంటే?