మనిషికి పంది గుండె.. రెండోరోజుకే చలోక్తులతో హుషారుగా ఉన్న రోగి!
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ వైద్యులు మరోసారి కీలకమైన అవయవమార్పిడి శస్త్ర చికిత్స చేశారు.
వాషింగ్టన్: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ వైద్యులు మరోసారి కీలకమైన అవయవమార్పిడి శస్త్ర చికిత్స చేశారు. మరణం ముప్పును ఎదుర్కొంటున్న 58 ఏళ్ల వ్యక్తిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా.. జన్యు మార్పిడి చేసిన పంది గుండెను అమర్చారు. ఈ శస్త్రచికిత్స జరిగిన 2 రోజులకు ఆ వ్యక్తి సరదాగా జోకులు వేస్తున్నాడని వైద్యులు తెలిపారు. కుర్చీలోనూ కూర్చోగలిగాడని చెప్పారు. రానున్న కొన్ని వారాలు అత్యంత క్లిష్టమైనవని పేర్కొన్నారు. ఆయితే, ఆయన ప్రస్తుతం స్పందిస్తున్న తీరుతో ఆశ్చర్యానికి గురైనట్లు వైద్యులు పేర్కొన్నారు. అనారోగ్య కారణాలు, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా సంప్రదాయ పద్ధతిలో గుండె మార్పిడి కుదరకపోవడం వల్ల పంది గుండెను అమర్చినట్లు వైద్యులు వివరించారు. గత ఏడాది ఇదే వర్సిటీ వైద్యుల బృందం ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి అమర్చింది. అయితే చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
North Korea: కిమ్ శాటిలైట్.. శ్వేతసౌధం, పెంటాగన్ ఫొటోలు తీసిందట..!
తాము పంపిన నిఘా ఉపగ్రహం అమెరికాలోని కీలక భవనాలు, స్థావరాల ఫొటోలు తీసిందని ఉత్తర కొరియా(North Korea) వెల్లడించింది. అయితే ఈ దేశం చేసిన ప్రకటనపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
Musk: అప్పటి వరకు ప్రతిరోజూ ఈ ట్యాగ్ ధరిస్తా: ఎలాన్ మస్క్
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్(Musk) ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
USA: ‘ప్రార్థనా స్థలాల్లో రాజకీయాలొద్దు’.. ఖలిస్థానీల దుశ్చర్యపై ‘సిఖ్స్ ఆఫ్ అమెరికా’ ఖండన
అమెరికాలో గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధూను ఖలిస్థాన్ మద్దతుదారులు అడ్డుకోవడాన్ని ‘సిఖ్స్ ఆఫ్ అమెరికా’ తీవ్రంగా ఖండించింది. -
Britain-Greek: పురాతన శిల్పాల వివాదం.. ప్రధానుల భేటీ రద్దు
పురాతన శిల్పాలను తిరిగిచ్చే విషయంలో తలెత్తిన వివాదం కారణంగా.. గ్రీస్ ప్రధానితో సమావేశాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రద్దు చేసుకున్నారు. -
అమెరికా అభ్యర్థనకు ఓకే.. కెనడాకు మాత్రం నో: కీలక కేసుల దర్యాప్తుపై భారత దౌత్యవేత్త వ్యాఖ్యలు
India-US-Canada: ఖలిస్థానీ ఉగ్రవాదులు నిజ్జర్, పన్నూలకు సంబంధించిన కేసుల్లో అమెరికా, కెనడా కోరిన దర్యాప్తులకు భారత్ వేర్వేరుగా స్పందించింది. ఇందుకు స్పష్టమైన కారణం ఉందని కెనడాలోని భారత హైకమిషనర్ వెల్లడించారు. అదేంటంటే..? -
గాజాలో దాడులను ముగించాలి
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధ పరిస్థితులపై స్పెయిన్లోని బార్సెలోనాలో సోమవారం ఐరోపా సమాజం (ఈయూ), అరబ్, ఉత్తర ఆఫ్రికా దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. 42 దేశాలకు చెందిన ప్రతినిధులు భేటీకి వచ్చారు. -
బుకర్ ప్రైజ్ విజేత పాల్ లించ్
ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ను 2023 సంవత్సరానికి గాను ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ గెలుచుకున్నారు. ఆయన రాసిన ‘ప్రాఫెట్ సాంగ్’ నవలకు ఈ అవార్డు లభించింది. -
నకిలీ ప్రపంచంలో ‘నిజం’ కోసం ఆరాటం
సాంకేతిక సాయంతో తన ఫొటోలను అసభ్యంగా మార్చి ప్రచారంలో పెట్టారని ఇటీవల ఒక నటి ఆక్రోశించడంతో ‘డీప్ఫేక్’ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. -
America - Work Permits: అమెరికాలో పని అనుమతులపై రగడ
మెక్సికో, వెనెజువెలా, కొలంబియా వంటి లాటిన్ దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూ కొత్త సమస్యలు కొనితెస్తోంది. అమెరికాలో పంటకోతలు, పండ్లు, కూరగాయలు తెంపడం, హోటళ్లు, దుకాణాల్లో, భవన నిర్మాణంలో పనిచేయడం వంటివాటితో వలసదారులు జీవనాధారం పొందుతున్నారు. -
నల్ల సముద్రంలో తుపాను.. అంధకారంలో 20 లక్షల మంది
నల్ల సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రష్యా ఆక్రమిత క్రిమియా అతలాకుతలమైంది. దక్షిణ రష్యాలోని సోచీ తీరంలోనూ పెద్దఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. అనాపా, కుబాన్ తదితర ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. -
భారతీయ కొవిడ్ బాధితులకు ప్రయోజనం అంతంతే
కొవిడ్-19 చికిత్సకు డెక్సామెథాసోన్ మందును ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ఐరోపావాసులకు కలిగేంత ప్రయోజనం భారతీయులకు కలగలేదని ప్రముఖ వైద్యపత్రిక ‘లాన్సెట్’ ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. -
ఊపిరితిత్తుల వాపుతో బాధపడుతున్న పోప్
ఊపిరితిత్తుల వాపుతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్(86).. యాంటీబయాటిక్స్ను ఉపయోగిస్తున్నారని వాటికన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆయనకు నిమోనియా కానీ జ్వరం కానీ లేవని స్పష్టంచేసింది. -
పాక్లో భద్రతాబలగాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్లో తెహ్రీక్-ఎ-తాలిబాన్(టీటీపీ) తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. భద్రతా బలగాల్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడిచేశారు. -
న్యూజిలాండ్కు కొత్త ప్రధానిగా లక్సన్
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ (53) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దేశార్థికాన్ని మెరుగుపరచడమే తన ప్రథమ లక్ష్యమని ప్రకటించారు. -
పోలండ్కు అల్పాయుష్షు ప్రభుత్వం!
పోలండ్లో సోమవారం ప్రమాణ స్వీకారం చేసే మితవాద లా అండ్ జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి 14 రోజుల్లోనే ఆయుష్షు తీరిపోనుంది. అక్టోబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 460 స్థానాల్లో ఆ పార్టీకి 194 మాత్రమే వచ్చాయి. -
మెటాపై 33 అమెరికా రాష్ట్రాల దావా
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల మాతృ సంస్థ ‘మెటా’.. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచాన్ని సేకరించిందని ఆరోపిస్తూ అమెరికాలోని పలు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. -
న్యూయార్క్లో రెచ్చిపోయిన ఖలిస్థానీ మద్దతుదారులు
అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. సిక్కుల గురుపూర్ణిమ సందర్భంగా న్యూయార్క్లోని హిక్స్విల్ గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధూను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. -
బ్యాక్టీరియాకు నాలుగుతరాల జ్ఞాపకాలు!
ఏకకణ జీవులైనప్పటికీ బ్యాక్టీరియాకు జ్ఞాపకశక్తి సామర్థ్యం ఉంటుందని, ఆ జ్ఞాపకాలను తమ వారసులకూ చేరవేయగలవని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
సొంత పాస్పోర్టు నంబర్లే ఇవ్వాలి
వీసాల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా రాయబార కార్యాలయం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఎఫ్, ఎం, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇవి వర్తిస్తాయి. -
కాల్పుల విరమణ మరో 2 రోజులు పొడిగింపు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో 2 రోజులు కొనసాగనుంది. తొలుత కుదుర్చుకున్న నాలుగు రోజుల ఒప్పందం సోమవారంతో ముగియడంతో ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో 2 రోజుల పొడిగింపునకు రెండు వర్గాలు అంగీకరించాయి. -
ఉభయ కొరియాల మధ్య సైనిక గస్తీ శిబిరాల పునరుద్ధరణ
ఇటీవల ఉత్తర కొరియా ఒక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో దక్షిణ కొరియాతో ఉద్రిక్తత పెరిగింది. సరిహద్దులో గస్తీ శిబిరాలను ఉత్తర కొరియా పునరుద్ధరించింది. దక్షిణ కొరియాతో ఇదివరకు కుదిరిన సంధికి చెల్లుచీటీ రాసింది.


తాజా వార్తలు (Latest News)
-
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి
-
ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్
-
North Korea: కిమ్ శాటిలైట్.. శ్వేతసౌధం, పెంటాగన్ ఫొటోలు తీసిందట..!
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు
-
Bobby Deol: బాబీ దేవోల్ చెప్పిన డైలాగ్ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..
-
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!