‘క్యాన్సర్పై పోరుకు’ దారి చూపిన మైటోకాండ్రియా
క్యాన్సర్పై పోరుకు ఉపయోగపడే సమర్థ సాధనం ఇమ్యునోథెరపీ! రోగి స్వీయ రోగ నిరోధక వ్యవస్థను యుక్తిగా వాడుకుంటూ కణితి కణాలను నిర్మూలించడం ఇందులో కీలకం.
క్యాన్సర్పై పోరుకు ఉపయోగపడే సమర్థ సాధనం ఇమ్యునోథెరపీ! రోగి స్వీయ రోగ నిరోధక వ్యవస్థను యుక్తిగా వాడుకుంటూ కణితి కణాలను నిర్మూలించడం ఇందులో కీలకం. అయితే కొందరిపై ఇది ఫలించడంలేదు. ఈ నేపథ్యంలో ఇమ్యునోథెరపీని మెరుగుపరచడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఈ దిశగా అమెరికాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఒక కీలక ముందడుగు వేశారు. కణంలోని మైటోకాండ్రియన్(బహువచనం మైటోకాండ్రియా)ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇది శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో తొలి అంచెలో మార్పులు చేయడం ద్వారా కణితి పరిమాణాన్ని తగ్గించొచ్చని తేల్చారు. రోగ నిరోధక వ్యవస్థ.. సులువుగా కణితులను గుర్తించగలిగేలా, ఇమ్యునోథెరపీకి మరింత సమర్థంగా స్పందించేలా చేసే ఒక విధానాన్ని కనుగొన్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కణాల్లో ముఖ్యమైన భాగం మైటోకాండ్రియన్. కణంలోని జీవరసాయన చర్యలకు అవసరమైన శక్తిని అదే అందిస్తుంది. అందుకే దాన్ని ‘పవర్ హౌస్’గా పిలుస్తారు. క్యాన్సర్ కణాలు మైటోకాండ్రియాపై పెద్దగా ఆధారపడబోవని గతంలో భావించేవారు. అయితే కణితి ఎదుగుదలలో ఈ భాగం చాలా ముఖ్య పాత్రలను పోషిస్తుందని ఇటీవల వెల్లడైంది. అది రోగనిరోధక వ్యవస్థతోపాటు ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా కణితి కణాలు తమ శక్తి అవసరాలు, ఉత్పత్తి మధ్య సమతౌల్యాన్ని సాధిస్తుంటాయి. దీన్ని ‘మెటబోలిక్ దశ’గా పేర్కొంటారు. ఫలితంగా అవి వేగంగా ఎదిగే సామర్థ్యాన్ని సాధించడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకోగలుగుతాయి. ఈ నేపథ్యంలో.. అటు కణితి వృద్ధిని ఇటు రోగనిరోధక వ్యవస్థ స్పందన తీరును మైటోకాండ్రియన్ ఎలా ప్రభావితం చేస్తుందన్నది పరిశీలించడానికి సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఈ క్రమంలో వారు ఎలక్ట్రాన్ బట్వాడా శృంఖలంపై దృష్టిసారించారు. ఈ ప్రక్రియలో ఎలక్ట్రాన్లు మైటోకాండ్రియా గుండా పయనిస్తాయి. ఫలితంగా శక్తి సరఫరా అణువులైన అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తి జరుగుతుంది. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ ఎలక్ట్రాన్ రవాణా శృంఖలంలో ఒక కీలక అంచెలో మార్పులు చేపట్టారు.
ఎలా చేశారంటే..
- ఏటీపీ ఉత్పత్తి కోసం మైటోకాండ్రియాలో ఎలక్ట్రాన్లు రెండు మార్గాల్లో పయనిస్తాయి. అలా కాకుండా ప్రధానంగా ఒకే మార్గం గుండా ఈ పయనం సాగేలా శాస్త్రవేత్తలు కొన్ని మార్పులు చేశారు.
- దీనివల్ల సక్సినేట్ అనే పదార్థం ఎక్కువగా ఉత్పత్తయింది. ఫలితంగా కణ కేంద్రకంలో రోగనిరోధకతకు సంబంధించిన జన్యువులు క్రియాశీలమయ్యాయి. ఇదే క్రమంలో కణితి ఉపరితలంపై ఎంహెచ్సీ అనే ప్రొటీన్ పరిమాణం కూడా పెరిగింది.
- ఎంహెచ్సీ పెరుగుదల వల్ల కణితి కణాలు.. రోగనిరోధక వ్యవస్థలోని ‘హంతక’ టి కణాల దృష్టిలో ఎక్కువగా పడుతున్నాయి. క్యాన్సర్ కణాలు కంటపడితే వాటిని చంపేసే సామర్థ్యం వీటికి ఉంది.
- రోగనిరోధక వ్యవస్థ కంటపడకుండా తప్పించుకుంటున్న కణితి గుట్టురట్టు చేసి, దాన్ని దుర్బలంగా మార్చడానికి ఈ విధానం పనికొస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
- మైటోకాండ్రియాకు హాని కలిగించకుండా క్యాన్సర్పై పోరుకు ఈ విధానాన్ని వినియోగించాల్సిన తీరుపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
జర్మనీ(Germany)కి ఖతార్ నుంచి దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? లేదా..? తెలియాల్సి ఉంది. -
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజ్ఞప్తి చేశారు. -
Nithyananda: కైలాస దేశంతో ఒప్పందం.. పరాగ్వే దేశ మంత్రి పదవి ఊడగొట్టిన నిత్యానంద
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’తో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
Israel-Hamas: ముగిసిన సంధి.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలు
Israel-Hamas: బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాత్కాలికంగా కుదిరిన సంధి గడువు ముగిసింది. దీంతో గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. -
పన్నూ హత్యకు కుట్ర.. భారతీయుడిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా
సిక్కు వేర్పాటువాది హత్య కుట్రలో భారత వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలను అమెరికా (USA) సీరియస్గా తీసుకుంది. అదే సమయంలో భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని వ్యాఖ్యానించింది. -
Iraq: ఇరాక్లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్లోని దియాలా ప్రావిన్స్లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
-
Jigarthanda Double X: ఓటీటీలోకి ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!