భారత్ పర్యటనలో జాగ్రత్త
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సారి ఏకంగా హిట్లర్తో కలిసి పోరాడిన నాజీ డివిజన్ సైనికుడిని పార్లమెంట్ సాక్షిగా గౌరవించి కలకలం సృష్టించింది.
తమ దేశ పౌరులకు కెనడా మళ్లీ హెచ్చరిక
టొరంటో: అత్యవసరమైతే తప్ప భారత పర్యటన చేయొద్దని తమ దేశ పౌరులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన కెనడా సోమవారం మరోసారి ప్రయాణ సలహాను జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, కొందరు ఆందోళనలకూ పిలుపునిస్తున్నారని.. కాబట్టి భారత్లో పర్యటిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని తమ దేశ పౌరులకు సూచించింది. ఖలిస్థాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
నాజీలపై ట్రూడో ప్రేమ
ఇంటర్నెట్డెస్క్: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సారి ఏకంగా హిట్లర్తో కలిసి పోరాడిన నాజీ డివిజన్ సైనికుడిని పార్లమెంట్ సాక్షిగా గౌరవించి కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంటోని రోటా ఆ తర్వాత తీరిగ్గా యూదులకు క్షమాపణలు చెప్పారు. మరో వైపు ప్రతిపక్ష పార్టీలు ట్రూడో వ్యవహారశైలిపై మండిపడుతున్నాయి. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల తొలిసారి కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పార్లమెంట్కు వచ్చారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ఆంటోనీ రోటా ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్లో జెలెన్స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్ రోటా స్వయంగా హంకాను పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడిగా కీర్తించారు. దీంతో అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు. అతడికి జెలెన్స్కీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. కెనడాలోని ‘ది ఫ్రెండ్స్ ఆఫ్ సైమన్ వెసింతల్ సెంటర్’ ప్రతినిధులు పార్లమెంట్ చర్యను ఖండించారు. హంకా చేతులు యూదుల రక్తంతో తడిశాయని పేర్కొన్నారు. మరో వైపు ప్రధాని జస్టిన్ ట్రూడో కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. జరిగిన పొరపాటుకు స్పీకర్ క్షమాపణలు చెప్పారని పేర్కొంది. కెనడా స్పీకర్ చర్యను రష్యా తీవ్రంగా గర్హించింది.
హిందువులకు బెదిరింపులు.. ఆలయాలపైనా దాడులు
దిల్లీ: కెనడాలో ఖలిస్థాన్ సానుభూతి పరుల అరాచకాలు గత కొంత కాలంగా భారీగా పెరిగాయని భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘‘ఈ అరాచకవాదులు..బహిరంగంగానే కెనడాలోని మైనారిటీ హిందువులను బెదిరిస్తున్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నారు. మన దేశ దౌత్యవేత్తల భద్రతకు ముప్పుగా పరిణమించారు. పంజాబ్లో ఏ చిన్న విషయం జరిగినా కెనడా నుంచి తీవ్రంగా స్పందిస్తున్నారు. వీరిలో చాలా మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో చురుగ్గా ఉన్నారు. అయినా అక్కడి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇది రెండు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. సోమవారం దిల్లీలో జరిగిన నిఘా వర్గాల ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. ‘‘అక్కడి ప్రభుత్వ మద్దతుతోనే ఖలిస్థాన్ అనుకూలురు రెచ్చిపోతున్నారు. ఆధునిక భావాలు ఉన్న భారత్ అనుకూల సిక్కులను గురుద్వారాల నుంచి గెంటివేస్తున్నారు. పంజాబ్లోనూ హింసను వీరు ప్రేరేపిస్తున్నారు’’ అని ఆ సీనియర్ అధికారి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
China: ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ.. చైనా కఠిన నిర్ణయం..!
చైనా(China) తన అథ్లెట్లకు సైనిక శిక్షణ ఇస్తోంది. దానిలో ఏడేళ్ల నుంచి 25 ఏళ్ల యువ క్రీడాకారుల్ని భాగం చేసింది. -
US Citizenship: పాస్పోర్టు రెన్యూవల్కు అప్లై చేస్తే.. పౌరసత్వమే పోయింది!
పాస్పోర్టు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఏకంగా పౌరసత్వమే కోల్పోయిన పరిస్థితి అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఓ వైద్య నిపుణుడికి ఎదురయ్యింది. -
Virgin Atlantic: వంట నూనె ఇంధనంగా.. దూసుకెళ్లిన తొలి కమర్షియల్ విమానం!
వందశాతం సుస్థిర విమాన ఇంధనం (SAF) ఉపయోగించి వర్జిన్ అట్లాంటిక్ కమర్షియల్ విమానం రికార్డు సృష్టించింది. -
Israel-Hamas: 16 రోజులు చీకటి గదిలో బంధించి.. బాలుడిని హింసించిన హమాస్
హమాస్ చెర నుంచి విడుదలైన బందీల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులనే కనికరం చూపకుండా వారిపై హమాస్ జరిపిన అకృత్యాలు మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. -
Osprey aircraft: జపాన్ సముద్రంలో కుప్పకూలిన అమెరికా సైనిక విమానం
అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం (Osprey aircraft) జపాన్లో కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో ఎనిమిది మంది ఉన్నారు. -
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం.. ఇది రష్యా కుట్రేనా..?
ఉక్రెయిన్(Ukraine) సైన్యంలో అత్యంత కీలక హోదాలో ఉన్న అధికారి భార్యపై విషప్రయోగం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీని వెనక రష్యా హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
H-1B visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్న్యూస్.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్!
H-1B visa: అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్న్యూస్ చెప్పింది. స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్నారైలు తమ హెచ్-1బీ వీసాలను రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్ను డిసెంబరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. -
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?
భూకక్ష్యలోకి తొలిసారిగా ఇటీవల తాము ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేతసౌధం, పెంటగాన్ సహా అమెరికాకు చెందిన నౌకాస్థావరాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. -
అయిదు రోజులు నిద్ర లేకుండా లైవ్ స్ట్రీమింగ్లో ఆడి.. ప్రాణాలు హరీ
చైనాలో ఓ విద్యార్థి నిద్రాహారాలు మాని లైవ్ స్ట్రీమింగులో గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. హెనాన్స్ పింగ్డింగ్షాన్ వొకేషనల్ అండ్ టెక్నికల్ కళాశాలలో లీ హావో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. -
అప్పటి వరకూ ఈ ట్యాగ్ ధరిస్తా: మస్క్
సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్కు వచ్చారు. -
శ్రీలంక వీసా ఫ్రీ సేవలు ప్రారంభం
భారతీయులతోపాటు 7 దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్లాండ్ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజులపాటు పర్యటించవచ్చు. -
అమెరికాలో పొగమంచు.. ఢీకొట్టుకున్న 30 వాహనాలు
అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఇంటర్స్టేట్ 86 రహదారిపై సుమారు 30 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. -
రష్యా సరిహద్దులు పూర్తిగా మూసివేత: ఫిన్లాండ్
రష్యాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది. ఇప్పటికే పలు సరిహద్దు దారులను మూసివేసిన ఆ దేశం చివరి రహదారినీ మూసివేయన్నట్లు వెల్లడించింది. వలసలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. -
అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు లేదు!
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. -
మరో 11 మంది బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నాలుగో విడత బందీల విడుదల మంగళవారం ఉదయానికి పూర్తయింది. హమాస్ 11 మందిని, ఇజ్రాయెల్ 33 మందిని విడుదల చేశాయి. -
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
అమెరికాలోని పలు ఆస్పత్రులపై సైబర్ దాడి జరిగింది. దీంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సదుపాయాలకు అంతరాయం ఏర్పడింది.


తాజా వార్తలు (Latest News)
-
cybercrime: ఐటీ ఉద్యోగికి సైబర్ మోసగాళ్ల వల.. రూ.3.5 కోట్లకు టోకరా!
-
China: ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ.. చైనా కఠిన నిర్ణయం..!
-
Hyderabad: ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు
-
Social Look: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మానస్.. చెమటోడ్చిన దివి
-
Royal Enfield: వచ్చే ఏడాదిలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రానున్న బైక్స్ ఇవే..
-
Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ నా బేబీ.. మిగతావేమీ పట్టించుకోలేదు: షాలినీ పాండే