మరో మహమ్మారి పొంచి ఉంది
ప్రపంచానికి డిసీజ్ ఎక్స్ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్హామ్ చెప్పారని డైలీ మెయిల్ ఒక కథనాన్ని పేర్కొంది.
బ్రిటన్ శాస్త్రవేత్తల వెల్లడి
లండన్: ప్రపంచానికి డిసీజ్ ఎక్స్ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్హామ్ చెప్పారని డైలీ మెయిల్ ఒక కథనాన్ని పేర్కొంది. కరోనా మహమ్మారి కంటే డిసీజ్ ఎక్స్ ప్రజలపై 7 రెట్ల అధిక ప్రభావం చూపిస్తుందని డేమ్ కేట్ వెల్లడించారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మరో కొత్త మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎంతో కాలంగా సూచిస్తూనే ఉంది. ‘ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. వాటన్నింటినీ మానవాళికి ముప్పుగా భావించలేం. కానీ వాటిలో కొన్ని మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. వేలకొద్ది వైరస్లున్న 25 వైరస్ కుటుంబాలను శాస్త్రవేత్తలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చు. అయితే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వైరస్లు ఈ జాబితాలో లేవు. కరోనా మహమ్మారి సోకిన వారిలో ఎక్కువ మంది వైరస్ బారి నుంచి బయటపడగలిగారు. కానీ డిసీజ్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిపై ప్రభావం చూపిస్తుంది’ అని డేమ్ కేట్ అభిప్రాయపడ్డారు. డిసీజ్ ఎక్స్ను ఎదుర్కొనేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు ఇప్పటికే వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సుమారు 200 మంది శాస్త్రవేత్తలు విల్ట్షైర్లోని పోర్ట్డౌన్ ప్రయోగశాలలో జంతువుల నుంచి మనుషులకు వేగంగా వ్యాపించే వైరస్లను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?
భూకక్ష్యలోకి తొలిసారిగా ఇటీవల తాము ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేతసౌధం, పెంటగాన్ సహా అమెరికాకు చెందిన నౌకాస్థావరాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. -
అయిదు రోజులు నిద్ర లేకుండా లైవ్ స్ట్రీమింగ్లో ఆడి.. ప్రాణాలు హరీ
చైనాలో ఓ విద్యార్థి నిద్రాహారాలు మాని లైవ్ స్ట్రీమింగులో గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. హెనాన్స్ పింగ్డింగ్షాన్ వొకేషనల్ అండ్ టెక్నికల్ కళాశాలలో లీ హావో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. -
అప్పటి వరకూ ఈ ట్యాగ్ ధరిస్తా: మస్క్
సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్కు వచ్చారు. -
శ్రీలంక వీసా ఫ్రీ సేవలు ప్రారంభం
భారతీయులతోపాటు 7 దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్లాండ్ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజులపాటు పర్యటించవచ్చు. -
అమెరికాలో పొగమంచు.. ఢీకొట్టుకున్న 30 వాహనాలు
అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఇంటర్స్టేట్ 86 రహదారిపై సుమారు 30 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. -
రష్యా సరిహద్దులు పూర్తిగా మూసివేత: ఫిన్లాండ్
రష్యాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది. ఇప్పటికే పలు సరిహద్దు దారులను మూసివేసిన ఆ దేశం చివరి రహదారినీ మూసివేయన్నట్లు వెల్లడించింది. వలసలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. -
అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు లేదు!
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. -
మరో 11 మంది బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నాలుగో విడత బందీల విడుదల మంగళవారం ఉదయానికి పూర్తయింది. హమాస్ 11 మందిని, ఇజ్రాయెల్ 33 మందిని విడుదల చేశాయి. -
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
అమెరికాలోని పలు ఆస్పత్రులపై సైబర్ దాడి జరిగింది. దీంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సదుపాయాలకు అంతరాయం ఏర్పడింది.


తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
-
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
-
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
-
IND Vs AUS: మ్యాచ్లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్కు కలిసొచ్చింది!
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య