సముద్రంపైనే కంచెలు వేస్తున్న చైనా

చైనా ఏకంగా సముద్రంపైనే కంచెలు వేస్తోంది. ఫిలిప్పీన్స్‌ చేపల వేటను అడ్డుకునేందుకు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని స్కార్‌బోరో ప్రాంతంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేసింది.

Published : 26 Sep 2023 06:44 IST

ఫిలిప్పీన్స్‌ ఆరోపణ
కంచెను తొలగించామని వెల్లడి

మనీలా: చైనా ఏకంగా సముద్రంపైనే కంచెలు వేస్తోంది. ఫిలిప్పీన్స్‌ చేపల వేటను అడ్డుకునేందుకు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని స్కార్‌బోరో ప్రాంతంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేసింది. తమ చేపల వేట పడవలు రాకుండా బీజింగ్‌ ఇలా చేసిందని ఫిలిప్పీన్స్‌ ఆరోపించింది. అయితే వెంటనే ఆ కంచెను తొలగించామని తెలిపింది. ఈ ఘటనపై ఆ దేశ కోస్టుగార్డు ప్రతినిధి జైటర్రేలా ట్విటర్‌లో స్పందించారు. ‘గత శుక్రవారం సాధారణ సముద్ర గస్తీ సమయంలో ఫిలిప్పీన్స్‌ కోస్టుగార్డు ఈ తేలియాడే కంచెను గుర్తించింది. ఇది దాదాపు 980 అడుగులపైనే ఉంది. బాజో డె మాసిన్‌లోక్‌ ఆగ్నేయ ప్రాంతంలోని స్కార్‌బోరోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న సముద్ర దిబ్బలవైపు మా చేపల వేట పడవలు రాకుండా చైనా ఇలా చేస్తోంది’ అని ఆ ప్రతినిధి వెల్లడించారు. చైనా బోట్లు ఫిలిప్పీన్స్‌ నౌకలను 15 సార్లు రేడియో సెట్‌లో హెచ్చరించాయి. చైనా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నాయి. కానీ ఫిలిప్పీన్స్‌ నౌకలో కొందరు మీడియా సిబ్బంది ఉన్నారని తెలుసుకుని చైనా నౌకలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.  మరోవైపు చైనా ఈ ప్రకటనను ఖండించింది. ఫిలిప్పీన్స్‌ రాజకీయ ఆరోపణల కోసం తప్పుడు సమాచారాన్ని వాడుకుంటోందని పేర్కొంది. ఈ మేరకు చైనా ప్రతినిధి మావో నింగ్‌ ప్రకటన వెలువరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని