ఒడెసా పోర్టులో స్తంభించిన నౌకా సేవలు
ఉక్రెయిన్లో కీలకమైన ఒడెసా ప్రాంతంపై రష్యా జరిపిన డ్రోన్ దాడులు నల్లసముద్ర ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాడుల్లో ఓ గోదాము ధ్వంసం కాగా డజన్ల కొద్దీ ట్రక్కులు మంటల్లో చిక్కుకున్నాయి.
రష్యా క్షిపణి దాడులే కారణం
కీవ్: ఉక్రెయిన్లో కీలకమైన ఒడెసా ప్రాంతంపై రష్యా జరిపిన డ్రోన్ దాడులు నల్లసముద్ర ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాడుల్లో ఓ గోదాము ధ్వంసం కాగా డజన్ల కొద్దీ ట్రక్కులు మంటల్లో చిక్కుకున్నాయి. పేలుడు పదార్థాల కారణంగా ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. ఈ కారణంగా ఉక్రెయిన్, రొమేనియా మధ్య ప్రయాణికుల నౌకా(ఫెర్రీ) సేవలు నిలిచిపోయినట్లు మంగళవారం ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా దాడుల కారణంగా రొమేనియాలోని డాన్యూబ్ తీరంలోని ఇసాక్సియాలో ఫెర్రీలు నిలిచిపోయినట్లు స్థానిక సరిహద్దు పోలీసు ఒకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలో డాన్యూబ్ నదీ తీరానికి ఎగువన ఉన్న రొమేనియా పట్టణం గలాటి మీదుగా ట్రాఫిక్ను మళ్లించినట్లు వివరించారు. రష్యా ప్రయోగించిన మొత్తం 38 డ్రోన్లలో 26 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఒడిసా ప్రాంతంలో ఉక్రెయిన్ ఆహార ధాన్యాల ఎగుమతికి కీలకంగా ఉన్న ఇజ్మైల్ను రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ క్రమంలో రొమేనియా వైపు నుంచి చిత్రీకరించిన ఓ వీడియోలో ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ సోమవారం రాత్రి రష్యా డ్రోన్లను పేల్చివేస్తున్న దృశ్యాలు కనిపించాయి. మరోపక్క రెండు నారింజ రంగు అగ్నిగోళాలు నౌకాశ్రయ సమీప ప్రాంతాన్ని పేల్చివేస్తున్నట్లు అగుపించింది. ఇంకోపక్క తాము నిర్వహించిన క్షిపణి దాడిలో మరణించాడని ఉక్రెయిన్ సోమవారం పేర్కొన్న రష్యా నౌకాదళాధికారి ఓ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నట్లు కనిపిస్తున్న మరో వీడియో ఒకటి బయటపడటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాసీం సులేమానీ హత్యకు 50 బిలియన్ల డాలర్లు చెల్లించండి..అమెరికాకు ఇరాన్ కోర్టు ఆదేశం
నాలుగేళ్ల క్రితం ఇరాన్(Iran)కు చెందిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసీం సులేమానీ అమెరికా దాడిలో మృతి చెందాడు. దీనిపై అమెరికా(USA) నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
Hamas: దాడులకు ముందు భారీగా షార్ట్ సెల్లింగ్.. రూ.కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు!
హమాస్ దాడి సమాచారం ముందే తెలిసిన కొందరు ఇన్వెస్టర్లు ఐదు రోజుల ముందు ఇజ్రాయెల్ కంపెనీల షేర్లను (Short Selling) భారీగా కొనుగోలు చేశారట. -
Biden-Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే ప్రస్తుత, మాజీ అధ్యక్షులు బైడెన్, ట్రంప్ రంగంలోకి దిగారు. -
Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడాన్ని ఖండిస్తున్న మానవ, మహిళా హక్కుల సంస్థలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ మహిళలపై దాడులు జరిగినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. -
Pakistan: పాక్లో ఆగని ఉగ్రవాదుల హత్యలు.. హఫీజ్ సయీద్ అనుచరుడి కాల్చివేత
Pakistan: పాక్లో ఉగ్రవాదుల హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. -
Israel: లెబనాన్కు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్ సైన్యం..!
ఇజ్రాయెల్ పొరపాటున జరిపిన దాడిలో లెబనాన్ సైనికుడు మృతి చెందాడు. దీనికి ఐడీఎఫ్ క్షమాపణ చెప్పింది. -
Kim Jong Un: ‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. వీడియో వైరల్
Kim Jong Un: కిమ్ పేరు వినగానే ఆయన నియంతృత్వ వైఖరే గుర్తొస్తుంది. తన కఠిన ఆంక్షలతో ప్రజలను వణికిస్తోన్న ఈ నియంత.. కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
థాయ్లాండ్లో చెట్టును ఢీకొన్న బస్సు.. 14 మంది మృతి
థాయ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 49 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. -
కెన్యాకు రూ.2,084 కోట్ల రుణం
వ్యవసాయరంగ ఆధునికీకరణకుగాను కెన్యాకు రూ.2,084 కోట్లు (250 మిలియన్ డాలర్లు) సమకూర్చాలని భారత్ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. -
ప్రపంచ సగటులో భారత్ ఉద్గారాలు సగమే
కార్బన్ డయాక్సైడ్ (సీవో2) వెలువరించడంలో 2022లో భారతదేశ సగటు 5% మేర పెరిగినా అది ప్రపంచ సరాసరిలో సగం కంటే తక్కువేనని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో కూడిన ‘గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు’ తేల్చింది. -
అలబామా వర్సిటీలో నేడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య చర్చ
అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య బుధవారం జరిగే చర్చలో భారత సంతతి వ్యక్తులు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి కూడా పాల్గొంటున్నారు. -
ఇజ్రాయెల్ది మానవ హననం
గాజాలో ఇజ్రాయెల్ మానవ హననానికి పాల్పడుతోందని, ఆ దేశం తీరుతో పశ్చిమాసియా ప్రమాదంలో పడుతోందని ఖతార్, తుర్కియే ధ్వజమెత్తాయి. -
భారత్పై దుష్ప్రచారమే లక్ష్యంగా చైనా నకిలీ ఫేస్బుక్ ఖాతాలు
భారత్పై విషం చిమ్మడమే లక్ష్యంగా చైనా నుంచి పుట్టుకొస్తున్న నకిలీ ఫేస్బుక్ ఖాతాల ముప్పును టెక్ దిగ్గజం మెటా తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. -
మళ్లీ పేలిన ఇండోనేసియా అగ్నిపర్వతం
పశ్చిమ ఇండోనేసియాలోని మౌంట్ మెరపి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. ఆదివారం సంభవించిన దుర్ఘటన నుంచి స్థానికులు ఇంకా కోలుకోకముందే సోమవారం మరో విస్ఫోటనం చోటుచేసుకుంది. -
రష్యా దాడిలో ఇద్దరు ఉక్రెయిన్ వాసుల మృతి
ఉక్రెయిన్ దక్షిణ నగరం ఖేర్సన్పై రష్యా మంగళవారం జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. -
ఖాన్ యూనిస్ రక్తసిక్తం
గాజాలోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ రక్తసిక్తమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేయడంతో అల్లకల్లోలమైంది. -
ఖలిస్థానీ ఉగ్రవాది లక్బిర్సింగ్ పాకిస్థాన్లో మృతి
పాకిస్థాన్లో నక్కిన మరో ఖలిస్థానీ ఉగ్రవాది మరణించాడు. నిషేధిత ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ నేత లక్బిర్సింగ్ అలియాస్ రోడే పాకిస్థాన్లోని రావల్పిండిలో తీవ్ర గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. -
గ్రీన్కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేలా బిల్లు
గ్రీన్కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు, దేశాల వారీగా వివక్షను చూపించేలా ఉన్న ప్రస్తుత విధానానికి స్వస్తి పలికే దిశగా ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు యూఎస్ ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. -
శాకాహారంతో అల్జీమర్స్కు కళ్లెం!
భారత్, జపాన్, చైనాల్లో తినే శాకాహారం, సంప్రదాయ భోజనంతో అల్జీమర్స్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. -
WHO: ఆల్కహాల్, తీపిపానియాల వాడకాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్వో కొత్త సిఫార్సు
ఆల్కహాల్, తీపి పదార్థాల వాడకాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంఖ్య కొత్త సిఫార్సు చేసింది. వీటి ఉత్పత్తులపై అధిక పన్నును విధించాలని ఒక మాన్యువల్ను విడుదల చేసింది. -
Hamas: ‘బందీలకు మత్తుమందు ఇచ్చి.. కృత్రిమ నవ్వులు తెప్పించి!’
బందీలు సంతోషంగా, ప్రశాంతంగా కనిపించేలా హమాస్ మిలిటెంట్లు వారికి మత్తుమందు ఇచ్చారని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
-
వాగుదాటుతూ ముగ్గురు గల్లంతు.. అల్లూరి జిల్లాలో గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవు
-
Social Look: శ్రీదేవి డ్రెస్లో మెరిసిన ఖుషి కపూర్.. మృణాల్ ఠాకూర్ స్పెషల్ పోస్ట్
-
Digital India Act: ఎన్నికల తర్వాతే డిజిటల్ ఇండియా యాక్ట్: రాజీవ్ చంద్రశేఖర్
-
ఖాసీం సులేమానీ హత్యకు 50 బిలియన్ల డాలర్లు చెల్లించండి..అమెరికాకు ఇరాన్ కోర్టు ఆదేశం
-
Chhattisgarh: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 80శాతం కోటీశ్వరులే..