మలేరియాపై మరో టీకాస్త్రం
ప్రాణాంతక మలేరియాపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. ఆ వ్యాధి నివారణ ప్రయత్నాల్లో దోహదపడగల సరికొత్త టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సోమవారం ఆమోద ముద్ర వేసింది.
లండన్: ప్రాణాంతక మలేరియాపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. ఆ వ్యాధి నివారణ ప్రయత్నాల్లో దోహదపడగల సరికొత్త టీకా వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సోమవారం ఆమోద ముద్ర వేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సాయంతో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. మలేరియా నుంచి ఇది 75% పైగా రక్షణ కల్పించగలదని పరిశోధకులు తెలిపారు. ఇది మూడు డోసుల టీకా. బూస్టర్ కూడా వేసుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మలేరియా బారిన పడే ముప్పు ఎక్కువగా ఉన్న చిన్నారుల్లో వాడకానికి రెండు నిపుణుల బృందాలు చేసిన సిఫార్సు మేరకు దానికి ఆమోద ముద్ర వేసినట్లు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ తెలిపారు. ఘనా, బుర్కినాఫాసోలో అధికారవర్గాలు ఈ వ్యాక్సిన్ను ఇప్పటికే ఆమోదించాయి. మలేరియా నివారణకు ఉపయోగపడే ‘మస్కిరిక్స్’ అనే టీకాకు (జీఎస్కే గ్రూప్ తయారుచేసింది) డబ్ల్యూహెచ్వో 2021లోనే ఆమోదముద్ర వేసింది. అది 30% మాత్రమే రక్షణ కల్పించగలదు. 4డోసుల ఆ వ్యాక్సిన్ ప్రభావం కొన్ని నెలల్లోనే తగ్గిపోతుంది. దానితో పోలిస్తే ఆక్స్ఫర్డ్-ఎస్ఐఐ టీకా ప్రభావశీలత ఎక్కువ. తక్కువ ధరకే లభిస్తుంది కూడా. దాని రేటు 2-4 డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?
భూకక్ష్యలోకి తొలిసారిగా ఇటీవల తాము ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేతసౌధం, పెంటగాన్ సహా అమెరికాకు చెందిన నౌకాస్థావరాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. -
అయిదు రోజులు నిద్ర లేకుండా లైవ్ స్ట్రీమింగ్లో ఆడి.. ప్రాణాలు హరీ
చైనాలో ఓ విద్యార్థి నిద్రాహారాలు మాని లైవ్ స్ట్రీమింగులో గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. హెనాన్స్ పింగ్డింగ్షాన్ వొకేషనల్ అండ్ టెక్నికల్ కళాశాలలో లీ హావో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. -
అప్పటి వరకూ ఈ ట్యాగ్ ధరిస్తా: మస్క్
సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్కు వచ్చారు. -
శ్రీలంక వీసా ఫ్రీ సేవలు ప్రారంభం
భారతీయులతోపాటు 7 దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్లాండ్ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజులపాటు పర్యటించవచ్చు. -
అమెరికాలో పొగమంచు.. ఢీకొట్టుకున్న 30 వాహనాలు
అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఇంటర్స్టేట్ 86 రహదారిపై సుమారు 30 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. -
రష్యా సరిహద్దులు పూర్తిగా మూసివేత: ఫిన్లాండ్
రష్యాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది. ఇప్పటికే పలు సరిహద్దు దారులను మూసివేసిన ఆ దేశం చివరి రహదారినీ మూసివేయన్నట్లు వెల్లడించింది. వలసలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. -
అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు లేదు!
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. -
మరో 11 మంది బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నాలుగో విడత బందీల విడుదల మంగళవారం ఉదయానికి పూర్తయింది. హమాస్ 11 మందిని, ఇజ్రాయెల్ 33 మందిని విడుదల చేశాయి. -
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
అమెరికాలోని పలు ఆస్పత్రులపై సైబర్ దాడి జరిగింది. దీంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సదుపాయాలకు అంతరాయం ఏర్పడింది.


తాజా వార్తలు (Latest News)
-
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
-
IND Vs AUS: మ్యాచ్లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్కు కలిసొచ్చింది!
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!
-
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు