హత్యచేసి.. బతికుందని నమ్మించాడు
నేరాలను దర్యాప్తు చేసిన అనుభవమో ఏమోగానీ.. ఓ పోలీసే స్వయంగా హత్య చేసి రెండేళ్లు చట్టానికి దొరక్కుండా తప్పించుకున్నాడు.
దిల్లీలో ఓ పోలీసు దురాగతం
దిల్లీ: నేరాలను దర్యాప్తు చేసిన అనుభవమో ఏమోగానీ.. ఓ పోలీసే స్వయంగా హత్య చేసి రెండేళ్లు చట్టానికి దొరక్కుండా తప్పించుకున్నాడు. దేశ రాజధాని దిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సురేంద్ర రాణా (42) దిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. గతంలో కానిస్టేబుల్గా పనిచేసిన మోనా అనే యువతితో అతనికి పరిచయం ఉంది. కానిస్టేబుల్గా ఉంటూనే ఎస్ఐ ఉద్యోగం సాధించిన ఆమె.. కొత్త ఉద్యోగంలో చేరలేదు. కానిస్టేబుల్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి.. సివిల్స్కు సిద్ధమయ్యేది. మరోవైపు, సురేంద్ర ఆమె వెంటబడేవాడు. మోనా మాత్రం తరచూ అతణ్ని వారించేది. ఈ క్రమంలో 2021 సెప్టెంబరు 8న వీరి మధ్య గొడవ జరిగింది. తర్వాత ఆమెను సురేంద్ర ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. శవాన్ని మురుగు కాల్వలో పడేశాడు. పైకి తేలకుండా శవంపై పెద్ద బండరాళ్లను పెట్టాడు.
కరోనా టీకా సర్టిఫికెట్ను సృష్టించి కట్టుకథ..
మోనాను చంపేసిన తర్వాత సురేంద్ర చిన్నగా కట్టుకథ అల్లడం ప్రారంభించాడు. బాధితురాలి కుటుంబసభ్యులకు ఫోన్చేసి అర్వింద్ అనే వ్యక్తితో ఆమె వెళ్లిపోయినట్లు తెలిపాడు. మోనా కోసం తాను గాలిస్తున్నట్లు వారిని నమ్మించాడు. వారితో కలిసి పలుమార్లు పోలీస్స్టేషన్కు కూడా వెళ్లాడు. ఆమె బతికే ఉన్నట్లు నమ్మించడం కోసం.. కరోనా టీకా సర్టిఫికెట్ పుట్టించాడు. మోనా బ్యాంకు ఖాతా నుంచి తరచూ లావాదేవీలు జరిపాడు. సిమ్ కార్డును కూడా ఉపయోగించాడు. అక్కడితో ఆగకుండా తన బావమరిది రాబిన్నూ ఇందులోకి దింపాడు. అతనితో అర్వింద్లా మాట్లాడిస్తూ ఆ కుటుంబాన్ని ఏమార్చే ప్రయత్నం చేశాడు. మధ్య మధ్యలో సురేంద్ర తన వద్ద ఉన్న మోనా ఆడియో రికార్డింగులను ఎడిట్ చేసి కుటుంబసభ్యులకు పంపేవాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఈ కేసు దిల్లీ క్రైమ్ బ్రాంచ్కు చేరింది. వారు అర్వింద్ పేరిట రాబిన్ చేస్తున్న ఫోన్ నంబరును ట్రేస్ చేయడంతో కొన్ని ఆధారాలు లభించాయి. వాటిని లోతుగా విచారించడంతో అసలు గుట్టు రట్టయ్యింది. సురేంద్రకు భార్య, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మోనా.. ఉన్నతస్థాయి అధికారిణి అవుతుందనే నమ్మకంతో ఆమె వెంట పడ్డాడు. కానీ, ఆమె అతణ్ని తండ్రిగా భావించానని చెప్పడంతో ఆగ్రహానికి గురై దారుణానికి ఒడిగట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. -
ఇక హెచ్-1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే
అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు. -
పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం
సంప్రదాయ ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్ అట్లాంటిక్ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. -
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
కాప్ సదస్సుకు గైర్హాజరుకానున్న బైడెన్
గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు. -
అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి
పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడానికి వెంటనే అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కోరారు. -
ఉష్ణమండలీకరణతో సముద్రజీవుల వలస
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ
క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. -
ఎన్నికల ముందు షరీఫ్కు ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (73)ను ఏవెన్ఫీల్డ్ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. -
నేపాల్లో తొలి స్వలింగ వివాహ నమోదు
నేపాల్లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్జంగ్ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ మహిళ మాయా గురుంగ్ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది. -
81కి చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. -
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం
ఉక్రెయిన్ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్ భార్య మరియా బుడనోవ్పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.