జాబిల్లిపైకి పాక్ పేలోడ్.. మోసుకెళ్లనున్న చైనా రాకెట్
చంద్రుడి ఆవలి వైపునకు 2024లో చైనా ప్రయోగించే చాంగే-6 రాకెట్ పాకిస్థాన్కు చెందిన క్యూబ్ శాట్ సూక్ష్మ పేలోడ్నూ మోసుకెళ్లనుంది.
బీజింగ్: చంద్రుడి ఆవలి వైపునకు 2024లో చైనా ప్రయోగించే చాంగే-6 రాకెట్ పాకిస్థాన్కు చెందిన క్యూబ్ శాట్ సూక్ష్మ పేలోడ్నూ మోసుకెళ్లనుంది. ఫ్రాన్స్కు చెందిన రాడాన్ డిటెక్టర్ పరికరం, ఇటలీకి చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ నూ, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కి చెందిన నెగెటివ్ అయాన్ డిటెక్టర్ను కూడా అది తీసుకెళ్లనుంది. భూమి నుంచి చంద్రుడు ఒకవైపే కనిపిస్తాడు. రెండోవైపు నిత్యం చీకటిలో ఉంటుంది. మానవులు ఇంతవరకు మనకు కనిపించే చంద్రోపరితలం నుంచి 10 సార్లు రాళ్లు, మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చారు. ప్రప్రథమంగా చంద్రుని రెండోవైపున దక్షిణ ధ్రువం-ఐట్కెన్ ప్రాంతం నుంచి నమూనాలను తీసుకురావడానికి చైనా చాంగే-6ను ప్రయోగిస్తోంది. ఈ యాత్రలో తన చిరకాల మిత్రదేశం పాకిస్థాన్కు భాగస్వామ్యం కల్పిస్తోంది. కక్ష్యలో తిరుగుతున్న చైనా అంతరిక్ష స్టేషన్ తియాంగాంగ్కు పాకిస్థాన్ ఈ ఏడాది మొదట్లో కొన్ని విత్తనాలను పంపి ప్రయోగాలు చేసింది. ఆ అంతరిక్ష కేంద్రానికి తన వ్యోమగామినీ పంపాలనీ, దక్షిణ ధ్రువం వద్ద చైనా ఏర్పాటుచేసే స్థావరంలో పాలుపంచుకోవాలనీ పాక్ ఆకాంక్షిస్తోంది. చంద్రుని రెండోవైపు నుంచి భూమికి కమ్యూనికేషన్ సంబంధాలు నెలకొల్పడానికి 2024 ప్రథమార్దంలో క్యూకియావో అనే రిలే ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?
భూకక్ష్యలోకి తొలిసారిగా ఇటీవల తాము ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేతసౌధం, పెంటగాన్ సహా అమెరికాకు చెందిన నౌకాస్థావరాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. -
అయిదు రోజులు నిద్ర లేకుండా లైవ్ స్ట్రీమింగ్లో ఆడి.. ప్రాణాలు హరీ
చైనాలో ఓ విద్యార్థి నిద్రాహారాలు మాని లైవ్ స్ట్రీమింగులో గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. హెనాన్స్ పింగ్డింగ్షాన్ వొకేషనల్ అండ్ టెక్నికల్ కళాశాలలో లీ హావో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. -
అప్పటి వరకూ ఈ ట్యాగ్ ధరిస్తా: మస్క్
సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్కు వచ్చారు. -
శ్రీలంక వీసా ఫ్రీ సేవలు ప్రారంభం
భారతీయులతోపాటు 7 దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్లాండ్ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజులపాటు పర్యటించవచ్చు. -
అమెరికాలో పొగమంచు.. ఢీకొట్టుకున్న 30 వాహనాలు
అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఇంటర్స్టేట్ 86 రహదారిపై సుమారు 30 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. -
రష్యా సరిహద్దులు పూర్తిగా మూసివేత: ఫిన్లాండ్
రష్యాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది. ఇప్పటికే పలు సరిహద్దు దారులను మూసివేసిన ఆ దేశం చివరి రహదారినీ మూసివేయన్నట్లు వెల్లడించింది. వలసలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. -
అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు లేదు!
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. -
మరో 11 మంది బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నాలుగో విడత బందీల విడుదల మంగళవారం ఉదయానికి పూర్తయింది. హమాస్ 11 మందిని, ఇజ్రాయెల్ 33 మందిని విడుదల చేశాయి. -
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
అమెరికాలోని పలు ఆస్పత్రులపై సైబర్ దాడి జరిగింది. దీంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సదుపాయాలకు అంతరాయం ఏర్పడింది.


తాజా వార్తలు (Latest News)
-
AP High Court: ఏయూలో అవినీతిపై పిటిషన్.. విచారణ 8 వారాల పాటు వాయిదా
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
-
AP High Court: ఐఆర్ఆర్ కేసు.. చంద్రబాబు పిటిషన్పై విచారణ వాయిదా
-
Gautham Vasudev Menon: సినిమా వాయిదా.. గౌతమ్ మేనన్ ఎమోషనల్ పోస్ట్
-
Kajal Aggarwal: అవన్నీ ఒకెత్తు.. ‘సత్యభామ’ ఒకెత్తు.. హైదరాబాద్లోనే ఉంటున్నా: కాజల్